మెగాస్టార్ చిరంజీవి తనే స్వయంగా స్పీచ్చులతో దంచి కొడుతుంటే.. అంతకంటే దారాళంగా మాట్టాడే వక్తలు ఆయన మీటింగుల్లో అవసరం లేదులే. అందుకే ఇప్పుడు గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్ రాకపోయినా, అలాగే సక్సెస్ మీట్ కు రామ్ చరణ్ రాకపోయినా కూడా అభిమానులు మాత్రం పెద్దగా ఫీలవ్వట్లేదు. కాని గాడ్ ఫాదర్ సినిమా చూసిన చాలామంది సినిమా లవ్వర్స్ మాత్రం.. సక్సెస్ మీట్లో దర్శకుడు పూరి జగన్ కనిపించుంటే బాగుండేదని చాలా కోరుకున్నారు. చివరకు ఆయన రాకపోయేసరికి డిజప్పాయింట్ అయ్యారు.
సినిమాలో చిన్న చిన్న క్యారక్టర్లు, అలాగే ఊరికే అలా కనిపించి వెళ్లిపోయిన వాళ్లను కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచిన మెగాస్టార్ చిరంజీవి టీమ్.. మరి దర్శకుడు పూరి జగన్ ను మర్చిపోయి ఉంటారా? డెఫెనెట్ గా మర్చిపోలేదు అంటున్నారు కొందరు సన్నిహితులు. అసలు ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఒక రూమర్ ఏంటంటే.. సక్సెస్ ఈవెంటుకు రావాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసినా కూడా పూరి జగన్ రెస్పాండ్ అవ్వలేదట. ఆల్రెడీ లైగర్ ఫ్లాప్ అయ్యిందని గోవాలో కూర్చుని తన తదుపరి సినిమా గురించి తర్జనభర్జన పడుతున్న పూరి, ఇప్పుడు మెగాస్టార్ ఈవెంటుకు వస్తే అనవసరంగా ట్రోలింగ్ కు గురయ్యే ఛాన్సుందని ఈ ఈవెంటును ఎవాయిడ్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా కూడా.. గాడ్ ఫాదర్ సినిమాలో తన మార్కు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పూరి జగన్ మాత్రం.. త్వరలోనే మాంచి యాక్టర్ గా కూడా కెరియర్ లాంచ్ చేసుకుంటే బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ తరహాలో విలన్ గా అయిన రోల్స్ చేసుకోవచ్చు. కాని ఆయన వీరాభిమానులు మాత్రం ఆల్రెడీ లైగర్ తో పోయిన పేరు ఎలాగైనా తిరిగి సంపాదించాలని.. తదుపరి ఒక పెద్ద హీరోతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. చూద్దం పూరి జగన్ ఏం చేయనున్నారో మరి!
This post was last modified on October 10, 2022 12:32 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…