మెగాస్టార్ చిరంజీవి తనే స్వయంగా స్పీచ్చులతో దంచి కొడుతుంటే.. అంతకంటే దారాళంగా మాట్టాడే వక్తలు ఆయన మీటింగుల్లో అవసరం లేదులే. అందుకే ఇప్పుడు గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్ రాకపోయినా, అలాగే సక్సెస్ మీట్ కు రామ్ చరణ్ రాకపోయినా కూడా అభిమానులు మాత్రం పెద్దగా ఫీలవ్వట్లేదు. కాని గాడ్ ఫాదర్ సినిమా చూసిన చాలామంది సినిమా లవ్వర్స్ మాత్రం.. సక్సెస్ మీట్లో దర్శకుడు పూరి జగన్ కనిపించుంటే బాగుండేదని చాలా కోరుకున్నారు. చివరకు ఆయన రాకపోయేసరికి డిజప్పాయింట్ అయ్యారు.
సినిమాలో చిన్న చిన్న క్యారక్టర్లు, అలాగే ఊరికే అలా కనిపించి వెళ్లిపోయిన వాళ్లను కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచిన మెగాస్టార్ చిరంజీవి టీమ్.. మరి దర్శకుడు పూరి జగన్ ను మర్చిపోయి ఉంటారా? డెఫెనెట్ గా మర్చిపోలేదు అంటున్నారు కొందరు సన్నిహితులు. అసలు ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఒక రూమర్ ఏంటంటే.. సక్సెస్ ఈవెంటుకు రావాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసినా కూడా పూరి జగన్ రెస్పాండ్ అవ్వలేదట. ఆల్రెడీ లైగర్ ఫ్లాప్ అయ్యిందని గోవాలో కూర్చుని తన తదుపరి సినిమా గురించి తర్జనభర్జన పడుతున్న పూరి, ఇప్పుడు మెగాస్టార్ ఈవెంటుకు వస్తే అనవసరంగా ట్రోలింగ్ కు గురయ్యే ఛాన్సుందని ఈ ఈవెంటును ఎవాయిడ్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా కూడా.. గాడ్ ఫాదర్ సినిమాలో తన మార్కు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పూరి జగన్ మాత్రం.. త్వరలోనే మాంచి యాక్టర్ గా కూడా కెరియర్ లాంచ్ చేసుకుంటే బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ తరహాలో విలన్ గా అయిన రోల్స్ చేసుకోవచ్చు. కాని ఆయన వీరాభిమానులు మాత్రం ఆల్రెడీ లైగర్ తో పోయిన పేరు ఎలాగైనా తిరిగి సంపాదించాలని.. తదుపరి ఒక పెద్ద హీరోతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. చూద్దం పూరి జగన్ ఏం చేయనున్నారో మరి!
This post was last modified on October 10, 2022 12:32 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…