ఆవిడంతే.. తనే ప్రొడ్యూస్ చేసుకున్న సినిమాలైనా లేదంటే ఇతరుల బ్యానర్లో హీరోయిన్ గా చేసిన సినిమాలైనా కూడా.. ప్రమోషన్లకు మాత్రం రాదు. కాకపోతే 2020 తరువాత సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. ప్రమోట్ చేస్తే కాని సినిమా రీచ్ అవ్వట్లేదు. అందుకే రాజమౌలి వంటి లెజెండ్స్ సినిమాలను ఏకంగా నెలలపాటు ప్రమోట్ చేస్తున్నారు. కాని ఇప్పుడైనా మన స్టార్ హీరోయిన్ నయనతారలో మార్పు వస్తుందని అనుకుంటే, ఆమె మాత్రం తన పందా తనదే అన్నట్లుగానే ప్రవర్తిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో మొదటి భార్య పాత్రలో కనిపించిన నయనతార, అప్పట్లో కూడా ప్రమోషన్లకు రాననే చెప్పిందని స్వయంగా చిరంజీవే ఒక సందర్బంలో చెప్పారు. అయితే ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలి పాత్రలో కనిపించిన ఈ కొత్త పెళ్ళికూతురును.. ప్రమోషన్లకు రావల్సిందిగా సినిమా టీమ్ కోరిందట. ఇంటర్యూలూ గట్రా ఇవ్వకపోయినా కూడా, కనీసం సక్సెస్ మీట్ కు రమ్మని అడిగరాట. కాస్త బిజీగా ఉన్నానని చెప్పేసిన నయనతార, మరోసారి ఆమెకు కాల్ చేస్తారేమోనని భావించి.. వెంటనే అభిమానులకు ఒక లెటర్ రాసేసింది.
గాడ్ ఫాదర్ లో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప వ్యక్తితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం తనకు కలిగిన గొప్ప భాగ్యమని.. మొత్తం టీమ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ అమ్మడు ఒక ప్రెస్ నోట్ పంపింది. ఈ మధ్యన ఏ సినిమాకూ ఇటువంటి నోట్ రాయని నయన్, ఇప్పుడు సడన్ గా ఒక లేఖ పంపిందంటే ఎవరికి మాత్రం సందేహం రాదు చెప్పండి? అందుకే దాని గురించి ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఏంటోమరి.. సూపర్ స్టార్ అయిన తరువాత సినిమాలను ఎంత ప్రమోట్ చేస్తే అంత లాభం వస్తుంది కాని, ఈ నయన్ రివర్స్ గేర్లో ఎందుకు వెళ్తుందో ఆమెకే తెలియాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…