ఆవిడంతే.. తనే ప్రొడ్యూస్ చేసుకున్న సినిమాలైనా లేదంటే ఇతరుల బ్యానర్లో హీరోయిన్ గా చేసిన సినిమాలైనా కూడా.. ప్రమోషన్లకు మాత్రం రాదు. కాకపోతే 2020 తరువాత సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. ప్రమోట్ చేస్తే కాని సినిమా రీచ్ అవ్వట్లేదు. అందుకే రాజమౌలి వంటి లెజెండ్స్ సినిమాలను ఏకంగా నెలలపాటు ప్రమోట్ చేస్తున్నారు. కాని ఇప్పుడైనా మన స్టార్ హీరోయిన్ నయనతారలో మార్పు వస్తుందని అనుకుంటే, ఆమె మాత్రం తన పందా తనదే అన్నట్లుగానే ప్రవర్తిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో మొదటి భార్య పాత్రలో కనిపించిన నయనతార, అప్పట్లో కూడా ప్రమోషన్లకు రాననే చెప్పిందని స్వయంగా చిరంజీవే ఒక సందర్బంలో చెప్పారు. అయితే ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలి పాత్రలో కనిపించిన ఈ కొత్త పెళ్ళికూతురును.. ప్రమోషన్లకు రావల్సిందిగా సినిమా టీమ్ కోరిందట. ఇంటర్యూలూ గట్రా ఇవ్వకపోయినా కూడా, కనీసం సక్సెస్ మీట్ కు రమ్మని అడిగరాట. కాస్త బిజీగా ఉన్నానని చెప్పేసిన నయనతార, మరోసారి ఆమెకు కాల్ చేస్తారేమోనని భావించి.. వెంటనే అభిమానులకు ఒక లెటర్ రాసేసింది.
గాడ్ ఫాదర్ లో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప వ్యక్తితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం తనకు కలిగిన గొప్ప భాగ్యమని.. మొత్తం టీమ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ అమ్మడు ఒక ప్రెస్ నోట్ పంపింది. ఈ మధ్యన ఏ సినిమాకూ ఇటువంటి నోట్ రాయని నయన్, ఇప్పుడు సడన్ గా ఒక లేఖ పంపిందంటే ఎవరికి మాత్రం సందేహం రాదు చెప్పండి? అందుకే దాని గురించి ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఏంటోమరి.. సూపర్ స్టార్ అయిన తరువాత సినిమాలను ఎంత ప్రమోట్ చేస్తే అంత లాభం వస్తుంది కాని, ఈ నయన్ రివర్స్ గేర్లో ఎందుకు వెళ్తుందో ఆమెకే తెలియాలి.
This post was last modified on October 10, 2022 12:17 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…