Movie News

ఒక లెటర్ తో సరిపెట్టేసిన నయనతార

ఆవిడంతే.. తనే ప్రొడ్యూస్ చేసుకున్న సినిమాలైనా లేదంటే ఇతరుల బ్యానర్లో హీరోయిన్ గా చేసిన సినిమాలైనా కూడా.. ప్రమోషన్లకు మాత్రం రాదు. కాకపోతే 2020 తరువాత సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. ప్రమోట్ చేస్తే కాని సినిమా రీచ్ అవ్వట్లేదు. అందుకే రాజమౌలి వంటి లెజెండ్స్ సినిమాలను ఏకంగా నెలలపాటు ప్రమోట్ చేస్తున్నారు. కాని ఇప్పుడైనా మన స్టార్ హీరోయిన్ నయనతారలో మార్పు వస్తుందని అనుకుంటే, ఆమె మాత్రం తన పందా తనదే అన్నట్లుగానే ప్రవర్తిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో మొదటి భార్య పాత్రలో కనిపించిన నయనతార, అప్పట్లో కూడా ప్రమోషన్లకు రాననే చెప్పిందని స్వయంగా చిరంజీవే ఒక సందర్బంలో చెప్పారు. అయితే ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలి పాత్రలో కనిపించిన ఈ కొత్త పెళ్ళికూతురును.. ప్రమోషన్లకు రావల్సిందిగా సినిమా టీమ్ కోరిందట. ఇంటర్యూలూ గట్రా ఇవ్వకపోయినా కూడా, కనీసం సక్సెస్ మీట్ కు రమ్మని అడిగరాట. కాస్త బిజీగా ఉన్నానని చెప్పేసిన నయనతార, మరోసారి ఆమెకు కాల్ చేస్తారేమోనని భావించి.. వెంటనే అభిమానులకు ఒక లెటర్ రాసేసింది.

గాడ్ ఫాదర్ లో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప వ్యక్తితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం తనకు కలిగిన గొప్ప భాగ్యమని.. మొత్తం టీమ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ అమ్మడు ఒక ప్రెస్ నోట్ పంపింది. ఈ మధ్యన ఏ సినిమాకూ ఇటువంటి నోట్ రాయని నయన్, ఇప్పుడు సడన్ గా ఒక లేఖ పంపిందంటే ఎవరికి మాత్రం సందేహం రాదు చెప్పండి? అందుకే దాని గురించి ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఏంటోమరి.. సూపర్ స్టార్ అయిన తరువాత సినిమాలను ఎంత ప్రమోట్ చేస్తే అంత లాభం వస్తుంది కాని, ఈ నయన్ రివర్స్ గేర్లో ఎందుకు వెళ్తుందో ఆమెకే తెలియాలి.

This post was last modified on October 10, 2022 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

1 hour ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

2 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

3 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

4 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

4 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

5 hours ago