డార్లింగ్ ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మంచి స్వింగ్ మీదున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి ముందు నుంచి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దాన్ని పూర్తిగా ఖండించడం కానీ కొత్తది ప్రకటించడం కానీ చేయకపోవడంతో ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఇదే ఫిక్స్ అయ్యారు. ఒక పాత థియేటర్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో హారర్ కామెడీ జానర్ లో రూపొందిస్తున్నట్టు ఆల్రెడీ లీక్ ఉంది. చాలా తక్కువ కాల్ షీట్లతో వీలైనంత వేగంగా రెండు మూడు నెలల్లోనే టాకీ పార్ట్ పూర్తయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు వినికిడి.
హీరోయిన్లు ఇద్దరు ఉంటారని ప్రస్తుతానికి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అడిగితే వీళ్ళు నో చెప్పేంత బిజీగా లేరు, ప్రభాస్ సరసన నటించేందుకు కాదనేంత అమాయకురాళ్లు అసలే కాదు. సో నిజంగా ప్రపోజల్ వెళ్లుంటే మాత్రం కన్ఫర్మ్ అయినట్టే. విలన్ గా సంజయ్ దత్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాకపోతే ఆయన డేట్లు మరీ టైట్ గా ఉండటంతో ఫైనల్ అయ్యేది లేనిది తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోగా మిగిలిన వ్యవహారాలు చక్కదిద్దే పనిలో మారుతీ టీమ్ చాలా బిజీగా ఉన్నట్టు తెలిసింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న పక్కా కమర్షియల్ పెద్ద దెబ్బ కొట్టడంతో మారుతీ దీంతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలే ప్యాన్ ఇండియా స్టార్ తో అవకాశం. ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ లైఫ్ లో రాదు. దీంతో కనక బ్లాక్ బస్టర్ కొడితే మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఎటొచ్చి సాహో, సలార్ లాగా వందల కోట్ల బడ్జెట్ ముడిపడిన మూవీ కాదు కాబట్టి కంటెంట్ తోనే బలంగా కొట్టాలి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం గట్టిగానే ఉంటాయట. దీని తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమా కూడా మారుతీకి రావడం లాంఛనమే. ఆల్రెడీ మెగాస్టారే పబ్లిక్ స్టేజి మీద చెప్పేశారు కాబట్టి డ్రాప్ అవ్వడం ఉండకపోవచ్చు
This post was last modified on October 10, 2022 9:55 am
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…