తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగి.. ఆ స్థానంలో ఉండగానే ఈ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్బస్టర్తో రీఎంట్రీ ఇచ్చాడు చిరు. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించాడాయన. ఈ నాలుగు సినిమాలు వేర్వేరు ఫలితాలను అందుకున్నాయి. ఫలితాల సంగతి పక్కన పెడితే అభిమానులు కోరుకున్న చిరంజీవి ఈ సినిమాల్లో కనిపించలేదన్నది మెజారిటీ మాట.
చిరు అంటే ఎంటర్టైన్మెంట్కు మారు పేరు. ఆయన్నుంచి ప్రధానంగా ఆశించేది వినోదమే. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఆ వింటేజ్ చిరును మళ్లీ తెరపై చూడాలని ఉందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.
ఐతే అభిమానుల నిరీక్షణకు తెరదించబోతున్నట్లు చిరు సంకేతాలు ఇచ్చేశారు. బాబీ దర్శకత్వంలో తాను చేస్తున్న కొత్త చిత్రం అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ఉంటుందని ముందు నుంచి చిరు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లోనూ చిరు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాడు.
బాబీ గురించి మాట్లాడుతూ.. అతడి దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా రౌడీ అల్లుడును పోలి ఉంటుందని చిరు చెప్పాడు. గాడ్ఫాదర్లో ఉండే సటిల్నెస్ అందులో ఉండదని.. తన పాత్ర అల్లరల్లరిగా ఉండి సినిమా అంతా సందడిగా సాగుతుందని చిరు చెప్పాడు. ఇదొక కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అని చిరు సంకేతాలు ఇచ్చాడు. చిరంజీవికి ఒక అభిమానిగా తాను ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు బాబీ ముందు నుంచే చెబుతున్నాడు. అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేకపోయినా.. అభిమానులు కోరుకునేలా చిరును చూపిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలవడం ఖాయం. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…