తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగి.. ఆ స్థానంలో ఉండగానే ఈ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్బస్టర్తో రీఎంట్రీ ఇచ్చాడు చిరు. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించాడాయన. ఈ నాలుగు సినిమాలు వేర్వేరు ఫలితాలను అందుకున్నాయి. ఫలితాల సంగతి పక్కన పెడితే అభిమానులు కోరుకున్న చిరంజీవి ఈ సినిమాల్లో కనిపించలేదన్నది మెజారిటీ మాట.
చిరు అంటే ఎంటర్టైన్మెంట్కు మారు పేరు. ఆయన్నుంచి ప్రధానంగా ఆశించేది వినోదమే. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఆ వింటేజ్ చిరును మళ్లీ తెరపై చూడాలని ఉందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.
ఐతే అభిమానుల నిరీక్షణకు తెరదించబోతున్నట్లు చిరు సంకేతాలు ఇచ్చేశారు. బాబీ దర్శకత్వంలో తాను చేస్తున్న కొత్త చిత్రం అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ఉంటుందని ముందు నుంచి చిరు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లోనూ చిరు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాడు.
బాబీ గురించి మాట్లాడుతూ.. అతడి దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా రౌడీ అల్లుడును పోలి ఉంటుందని చిరు చెప్పాడు. గాడ్ఫాదర్లో ఉండే సటిల్నెస్ అందులో ఉండదని.. తన పాత్ర అల్లరల్లరిగా ఉండి సినిమా అంతా సందడిగా సాగుతుందని చిరు చెప్పాడు. ఇదొక కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అని చిరు సంకేతాలు ఇచ్చాడు. చిరంజీవికి ఒక అభిమానిగా తాను ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు బాబీ ముందు నుంచే చెబుతున్నాడు. అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేకపోయినా.. అభిమానులు కోరుకునేలా చిరును చూపిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలవడం ఖాయం. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 9, 2022 10:23 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…