ఏ వ్యహారాన్నయినా తెగే దాకా లాగడం మంచిది కాదు. అందులోనూ అవతలి వాళ్లు తప్పు చేసి దొరికిపోయినపుడు, మన వైపు బలం ఉంది కదా అని అదే పనిగా టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ అనిపించుకోదు. ఒక స్థాయికి మించి దాడి చేస్తే అవతలి వ్యక్తి మీదే సానుభూతి మొదలవుతుంది. ఇప్పుడు ప్రవచనకారులైన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విషయంలో అలాంటి ఫీలింగే కలుగుతోంది జనాలకు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో తాను అవధానం చెబుతుండగా చిన్న డిస్టబెన్స్ రావడంతో అభిమానులతో ఫొటోలు దిగుతున్న చిరును ఉద్దేశించి హెచ్చరిక ధోరణితో గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఐతే కొంచెం పరుషంగా మాట్లాడినప్పటికీ.. చిరు చాలా హుందాగా ప్రవర్తించి ఆయన్ని గౌరవించిన తీరు ప్రశంసలందుకుంది. ఐతే ఆ వివాదానికి చిరు అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేయగా.. చిరు సన్నిహితులు, అభిమానులు కలిసి ఈ వివాదాన్ని తెగేదాకా లాగుతున్నారు.
ఇప్పటికే చిరు సోదరుడు నాగబాబు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ శ్రుతి మించింది. అది సరిపోదని ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో వరుసబెట్టి ఒక్కొక్కరుగా గరికపాటి మీద కౌంటర్లు వేయడం, చిరును కొనియాడడం చాలామందికి రుచించలేదు. గేయ రచయిత అనంత శ్రీరామ్ ‘గరిక’ అనే పదాన్ని వాడుతూ గరికపాటి గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయగా.. సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడేమో ‘వాడు’ అని సంబోధించేశాడు గరికపాటి వారిని. దర్శకుడు బాబి సైతం గరికపాటి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. తాను చేసిందాని పట్ల గరికపాటి చిరు అభిమానుల దగ్గర ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
నిజానికి ఆయన చేసింది మహా పాపం అయితే కాదు. చిరును ఆయనేమీ దూషించలేదు కూడా. చేసిన చిన్న తప్పిదానికి ఆయన మీద ఈ స్థాయిలో ఇంతమంది అదే పనిగా దాడి చేయడం అన్నది కరెక్టా అని ఆలోచించాలి. ఆ సంఘటనలో చిరు ప్రవర్తన అందరినీ మెప్పించి ఆయనపై ప్రశంసలు కురిశాయి. అంతటితో ఈ వ్యవహారం ముగిసి ఉంటే చిరు ఉన్నత స్థాయిలో ఉండేవారు. కానీ అదే పనిగా గరికపాటి మీద ఇలా దాడి చేయడం ద్వారా చిరు గౌరవాన్ని తగ్గించి, ఆయనపై వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఇంతటితో తెరదించడం మంచిది.
This post was last modified on October 9, 2022 3:42 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…