ఏ వ్యహారాన్నయినా తెగే దాకా లాగడం మంచిది కాదు. అందులోనూ అవతలి వాళ్లు తప్పు చేసి దొరికిపోయినపుడు, మన వైపు బలం ఉంది కదా అని అదే పనిగా టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ అనిపించుకోదు. ఒక స్థాయికి మించి దాడి చేస్తే అవతలి వ్యక్తి మీదే సానుభూతి మొదలవుతుంది. ఇప్పుడు ప్రవచనకారులైన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విషయంలో అలాంటి ఫీలింగే కలుగుతోంది జనాలకు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో తాను అవధానం చెబుతుండగా చిన్న డిస్టబెన్స్ రావడంతో అభిమానులతో ఫొటోలు దిగుతున్న చిరును ఉద్దేశించి హెచ్చరిక ధోరణితో గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఐతే కొంచెం పరుషంగా మాట్లాడినప్పటికీ.. చిరు చాలా హుందాగా ప్రవర్తించి ఆయన్ని గౌరవించిన తీరు ప్రశంసలందుకుంది. ఐతే ఆ వివాదానికి చిరు అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేయగా.. చిరు సన్నిహితులు, అభిమానులు కలిసి ఈ వివాదాన్ని తెగేదాకా లాగుతున్నారు.
ఇప్పటికే చిరు సోదరుడు నాగబాబు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ శ్రుతి మించింది. అది సరిపోదని ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో వరుసబెట్టి ఒక్కొక్కరుగా గరికపాటి మీద కౌంటర్లు వేయడం, చిరును కొనియాడడం చాలామందికి రుచించలేదు. గేయ రచయిత అనంత శ్రీరామ్ ‘గరిక’ అనే పదాన్ని వాడుతూ గరికపాటి గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయగా.. సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడేమో ‘వాడు’ అని సంబోధించేశాడు గరికపాటి వారిని. దర్శకుడు బాబి సైతం గరికపాటి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. తాను చేసిందాని పట్ల గరికపాటి చిరు అభిమానుల దగ్గర ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
నిజానికి ఆయన చేసింది మహా పాపం అయితే కాదు. చిరును ఆయనేమీ దూషించలేదు కూడా. చేసిన చిన్న తప్పిదానికి ఆయన మీద ఈ స్థాయిలో ఇంతమంది అదే పనిగా దాడి చేయడం అన్నది కరెక్టా అని ఆలోచించాలి. ఆ సంఘటనలో చిరు ప్రవర్తన అందరినీ మెప్పించి ఆయనపై ప్రశంసలు కురిశాయి. అంతటితో ఈ వ్యవహారం ముగిసి ఉంటే చిరు ఉన్నత స్థాయిలో ఉండేవారు. కానీ అదే పనిగా గరికపాటి మీద ఇలా దాడి చేయడం ద్వారా చిరు గౌరవాన్ని తగ్గించి, ఆయనపై వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఇంతటితో తెరదించడం మంచిది.
This post was last modified on October 9, 2022 3:42 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…