RRR సినిమా హిట్టయ్యాక మాంచి ఊపుమీదున్న రామ్ చరణ్ మాట్లాడితే మీడియాలో కనిపించేవాడు. పెద్దగా ప్రోగ్రామ్స్ కు రాకపోయినా కూడా ఎక్కడోచోట కనిపిస్తూ హల్చల్ చేసేవాడు. కాని ఆచార్య సినిమా బెడసికొట్టాక మాత్రం చరణ్ ఎందుకో బయటకు రావట్లేదు. ఆ సినిమా రిలీజయ్యాక శంకర్ సినిమా షూటింగులో బిజీగా ఉండి బయటకు రావట్లేదులే అనుకుంటే, గత రెండ్నెళ్ళ నుంచి #RC15 షూటింగ్ ఏదీ లేకున్నా, ఈ మెగా హీరో మాత్రం మొహం చాటేస్తున్నాడు. ఎందుకంటారు?
స్వయంగా తనే దగ్గరుండి లూసిఫర్ సినిమా రైట్స్ కొనేసి మరీ మెగాస్టార్ చిరంజీవికి అప్పజెప్పాడు కాని, సినిమాను ప్రమోట్ చెయ్యడానికి మాత్రం అసలు బయటకే రావట్లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లూసిఫర్ సినిమా తెలుగులో తీస్తే హిట్టవుతుందని భావించి సదరు సినిమా రైట్స్ కొన్న చరణ్, మరి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో కనిపించకపోవడం మాత్రం కాస్త విడ్డూరమే. కనీసం గాడ్ ఫాదర్ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి ఏదన్నా స్పెషల్ ఇంటర్యూ అయినా చేస్తాడని అనుకుంటే, అలాంటి ఫీట్లను కూడా చరణ్ చెయ్యలేదు. అసలెందుకు ఇలా తెర వెనుకే ఉంటున్నాడనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను కూడా కలవరపెడుతోంది.
మరో ప్రక్కన చస్తుంటే.. వరుస పెట్టి కొన్ని కొత్త బ్రాండ్లను సైన్ చేస్తున్న చరణ్, వాటి షూటింగ్ మరియు ప్లానింగ్ విషయంలో బిజీగా ఉన్నాడట. అందుకే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులకు టైమ్ కేటాయించలేకపోతున్నాడని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఎంత బిజీగా ఉంటే మాత్రం కనీసం సక్సెస్ మీట్ కు రావడానికి కూడా కుదరదా ఏంటి? ఏదో బలమైన కారణం ఉండటం చేతనే ఈ మెగా హీరో బయట కనిపించట్లేదని కొన్ని రూమర్లు కూడా వస్తున్నాయ్.
This post was last modified on October 9, 2022 8:39 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…