సురేఖావాణి.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగులో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన నటి ఆమె. ఒక దశలో ప్రతి పేరున్న సినిమాలో చిన్నదో, పెద్దదో ఒక క్యారెక్టర్ ఆమె చేస్తుండేది. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్లతో కలిసి ఆమె చేసిన సందడిని అంత సులువుగా మరిచిపోలేం. ఐతే కొంత కాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. ఉన్నట్లుండి ఫేడవుట్ అయిపోయి తెర మరుగైపోయింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె స్వాతిముత్యం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో మెరిసింది. ఆమె పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్నే పంచింది. ఇందులో సురేఖా వాణిని చూసి ఏమైపోయింది ఇన్నాళ్లూ అని ప్రేక్షకుల ఆశ్చర్యపోయారు.
ఐతే తనకు ఎందుకు అవకాశాలు ఆగిపోయాయో తనకే తెలియడం లేదని ఈ సినిమా సక్సెస్ మీట్లో సురేఖ వ్యాఖ్యానించింది. తన వెనుక ఏదో జరిగి తనకు ఛాన్సులు తగ్గిపోయాయని ఆమె పేర్కొనడం గమనార్హం.
ఈ మధ్యకాలంలో.. సినిమాలు చేయడం లేదు.. సినిమాలు చేయండి.. అని చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా స్వాతిముత్యం సినిమాలో చేసినటువంటి పాత్రలు చేయండని అంటున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఇదే.. నా వరకు అవకాశాలు వస్తే కదా.. చేయడానికి. ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ నా పాత్ర గురించి చెప్పడానికి వచ్చినపుడు ఈ క్యారెక్టర్కు ముందు నన్నే అనుకున్నావా అని అడిగాను. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకి ఎవరూ రావడం లేదు. అందుకు కారణమేంటో నాకూ తెలియడం లేదు. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను.
సురేఖా వాణి సినిమాలు మానేసిందని, ఇంకా ఏదేదో అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ నేను సినిమాలు మానేయను. సినిమాలు చేస్తూనే ఉంటాను అని సురేఖా వాణి స్పష్టం చేసింది. మొత్తంగా సురేఖావాణి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఎవరో తనకు అవకాశాలు రాకుండా కుట్ర చేస్తున్నారన్న అర్థం ధ్వనిస్తోంది.
This post was last modified on October 8, 2022 9:52 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…