సురేఖావాణి.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగులో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన నటి ఆమె. ఒక దశలో ప్రతి పేరున్న సినిమాలో చిన్నదో, పెద్దదో ఒక క్యారెక్టర్ ఆమె చేస్తుండేది. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్లతో కలిసి ఆమె చేసిన సందడిని అంత సులువుగా మరిచిపోలేం. ఐతే కొంత కాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. ఉన్నట్లుండి ఫేడవుట్ అయిపోయి తెర మరుగైపోయింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె స్వాతిముత్యం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో మెరిసింది. ఆమె పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్నే పంచింది. ఇందులో సురేఖా వాణిని చూసి ఏమైపోయింది ఇన్నాళ్లూ అని ప్రేక్షకుల ఆశ్చర్యపోయారు.
ఐతే తనకు ఎందుకు అవకాశాలు ఆగిపోయాయో తనకే తెలియడం లేదని ఈ సినిమా సక్సెస్ మీట్లో సురేఖ వ్యాఖ్యానించింది. తన వెనుక ఏదో జరిగి తనకు ఛాన్సులు తగ్గిపోయాయని ఆమె పేర్కొనడం గమనార్హం.
ఈ మధ్యకాలంలో.. సినిమాలు చేయడం లేదు.. సినిమాలు చేయండి.. అని చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా స్వాతిముత్యం సినిమాలో చేసినటువంటి పాత్రలు చేయండని అంటున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఇదే.. నా వరకు అవకాశాలు వస్తే కదా.. చేయడానికి. ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ నా పాత్ర గురించి చెప్పడానికి వచ్చినపుడు ఈ క్యారెక్టర్కు ముందు నన్నే అనుకున్నావా అని అడిగాను. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకి ఎవరూ రావడం లేదు. అందుకు కారణమేంటో నాకూ తెలియడం లేదు. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను.
సురేఖా వాణి సినిమాలు మానేసిందని, ఇంకా ఏదేదో అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ నేను సినిమాలు మానేయను. సినిమాలు చేస్తూనే ఉంటాను అని సురేఖా వాణి స్పష్టం చేసింది. మొత్తంగా సురేఖావాణి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఎవరో తనకు అవకాశాలు రాకుండా కుట్ర చేస్తున్నారన్న అర్థం ధ్వనిస్తోంది.
This post was last modified on October 8, 2022 9:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…