స్వాతిముత్యం.. దసరా రేసులో నిలిచిన చిన్న సినిమా. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ధైర్యంగా దఃసరా రేసులోకి వచ్చింది. కంటెంట్ మీద నమ్మకంతోనే తాము ఇంత ధైర్యం చేస్తున్నామని, ఇది దసరా సీజన్కు సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విడుదలకు ముందు చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అతడి మాటల్లో నిజం ఉంది. ఈ సినిమాలో విషయం ఉంది. ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
సరిగ్గా చెప్పాలంటే కంటెంట్ పరంగా ఈ దసరాకు బెస్ట్ మూవీ అంటే ‘స్వాతిముత్యం’యే. ‘ది ఘోస్ట్’ మూవీ ఎవరికీ రుచించలేదు. ‘గాడ్ ఫాదర్’ ఓకే అనిపించినా.. అది ఒక రీమేక్, పైగా కమర్షియల్ ఫార్మాట్లో సాగే సగటు మాస్ మూవీలా ఉంటుంది. ‘స్వాతిముత్యం’ అలా కాదు. ఇందులో కొత్త కథ ఉంది. కథానుసారం చక్కటి వినోదం ఉంది. అందుకే కంటెంట్ మాత్రమే చూస్తే ఇదే బెస్ట్ మూవీ.
ఐతే సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు బాగున్నాయి. అంతా ఓకే కానీ.. అందుకు తగ్గట్లుగా కలెక్షన్లు కనిపించడం లేదు. ఈ సినిమా షేర్ నామమాత్రంగా ఉండడంతో ఆ నంబర్స్ కూడా ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేయట్లేదు. చిత్ర బృందం కూడా వసూళ్ల గురించి మాట్లాడట్లేదు. తొలి రోజు నుంచి బుకింగ్స్ చూస్తే.. ఏ దశలోనూ ఆశాజనకంగా లేవు. ఫస్ట్ షోలకు మల్టీప్లెక్సుల్లో ఓ మోస్తరుగా ఆక్యుపెన్సీ ఉంటోంది. సింగిల్ స్క్రీన్ల బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు.
దసరా రేసులో వేరే పెద్ద సినిమాలున్నాయి కాబట్టి ‘స్వాతిముత్యం’పై జనాల దృష్టిపడడానికి కొంచెం సమయం పడుతుందని, వసూళ్లు నెమ్మదిగా పుంజుకుంటాయని అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా సరే.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్లో, కొత్త హీరో బెల్లంకొండ గణేష్ సినిమాకు ఏం పోతాంలే అనో జనాలు అటు చూస్తన్నట్లు లేరు. ప్రధానంగా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం ‘గాడ్ ఫాదర్’ మీదే ఉండడం ‘స్వాతిముత్యం’కు చేటు చేస్తున్ట్లుంది.
This post was last modified on October 8, 2022 4:13 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…