స్వాతిముత్యం.. దసరా రేసులో నిలిచిన చిన్న సినిమా. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ధైర్యంగా దఃసరా రేసులోకి వచ్చింది. కంటెంట్ మీద నమ్మకంతోనే తాము ఇంత ధైర్యం చేస్తున్నామని, ఇది దసరా సీజన్కు సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విడుదలకు ముందు చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అతడి మాటల్లో నిజం ఉంది. ఈ సినిమాలో విషయం ఉంది. ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
సరిగ్గా చెప్పాలంటే కంటెంట్ పరంగా ఈ దసరాకు బెస్ట్ మూవీ అంటే ‘స్వాతిముత్యం’యే. ‘ది ఘోస్ట్’ మూవీ ఎవరికీ రుచించలేదు. ‘గాడ్ ఫాదర్’ ఓకే అనిపించినా.. అది ఒక రీమేక్, పైగా కమర్షియల్ ఫార్మాట్లో సాగే సగటు మాస్ మూవీలా ఉంటుంది. ‘స్వాతిముత్యం’ అలా కాదు. ఇందులో కొత్త కథ ఉంది. కథానుసారం చక్కటి వినోదం ఉంది. అందుకే కంటెంట్ మాత్రమే చూస్తే ఇదే బెస్ట్ మూవీ.
ఐతే సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు బాగున్నాయి. అంతా ఓకే కానీ.. అందుకు తగ్గట్లుగా కలెక్షన్లు కనిపించడం లేదు. ఈ సినిమా షేర్ నామమాత్రంగా ఉండడంతో ఆ నంబర్స్ కూడా ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేయట్లేదు. చిత్ర బృందం కూడా వసూళ్ల గురించి మాట్లాడట్లేదు. తొలి రోజు నుంచి బుకింగ్స్ చూస్తే.. ఏ దశలోనూ ఆశాజనకంగా లేవు. ఫస్ట్ షోలకు మల్టీప్లెక్సుల్లో ఓ మోస్తరుగా ఆక్యుపెన్సీ ఉంటోంది. సింగిల్ స్క్రీన్ల బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు.
దసరా రేసులో వేరే పెద్ద సినిమాలున్నాయి కాబట్టి ‘స్వాతిముత్యం’పై జనాల దృష్టిపడడానికి కొంచెం సమయం పడుతుందని, వసూళ్లు నెమ్మదిగా పుంజుకుంటాయని అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా సరే.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్లో, కొత్త హీరో బెల్లంకొండ గణేష్ సినిమాకు ఏం పోతాంలే అనో జనాలు అటు చూస్తన్నట్లు లేరు. ప్రధానంగా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం ‘గాడ్ ఫాదర్’ మీదే ఉండడం ‘స్వాతిముత్యం’కు చేటు చేస్తున్ట్లుంది.
This post was last modified on October 8, 2022 4:13 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…