ఈ మధ్య ఒక్కొక్కరుగా తెలుగు స్టార్లు పాన్ ఇండియా లెవెల్కు తమ మార్కెట్ను విస్తరిస్తున్నారు. కొందరు ఉత్తరాదిన ప్లాన్ చేసి మార్కెట్ పెంచుకుంటుంటే.. కొందరికి అనుకోకుండా అక్కడ మార్కెట్ క్రియేట్ అవుతోంది. పుష్ప, కార్తికేయ-2 చిత్రాలతో అల్లు అర్జున్, నిఖిల్ సిద్దార్థలకు అనుకోకుండా అలాగే కలిసి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు ‘సైరా’ సినిమాతో ఉత్తరాదిన సత్తా చూపించాలని ప్రయత్నించారు కానీ.. ఆ చిత్రాన్ని అక్కడి వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఐతే ఈసారి చిరు ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. తన కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్తో క్యామియో రోల్ చేయించారు. అది సినిమాకు బాగానే ప్లస్ అయినట్లుంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఉత్తరాదిన పర్వాలేదనిపిస్తోంది. మామూలుగా అయితే ఈ సినిమాను అసలు పట్టించుకునేవారు కాదేమో.
కానీ సల్మాన్ క్యామియో చేయడం, పోస్టర్ల మీద ఆయన బొమ్మ ప్రధానంగా కనిపించడంతో హిందీ ‘గాడ్ ఫాదర్’కు నార్త్ బెల్ట్లో వసూళ్లు పర్వాలేదన్నట్లుగా వస్తున్నాయి. సినిమా కూడా అక్కడి జనాలకు నచ్చుతున్నట్లే ఉంది. రెండో రోజు నుంచే సినిమాకు స్క్రీన్లు, షోలు పెరుగుతుండగా.. శనివారం అదనంగా మరో 600 థియేటర్లు జోడిస్తున్నట్లు స్వయంగా చిరంజీవి ఒక వీడియో ద్వారా ప్రకటించారు.
గత వారం విడుదలైన ‘విక్రమ్ వేద’ అనుకున్నంత ప్రభావం చూపించకపోవడం, ‘పొన్నియన్ సెల్వన్’ అసలేమాత్రం హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించకపోవడం ‘గాడ్ ఫాదర్’కు కలిసొచ్చింది. ఈ వారం విడుదలైన ‘గుడ్ బై’ కూడా క్లాస్ సినిమా కావడంతో సింగిల్ స్క్రీన్ల విషయంలో ‘గాడ్ ఫాదర్’కు ఇబ్బంది లేదు. దీంతో ఆ సినిమాకు అవసరమైనన్ని స్క్రీన్లు కేటాయిస్తున్నట్లున్నారు. మరి ఫుల్ రన్లో ‘గాడ్ ఫాదర్’ హిందీ వెర్షన్ ఏమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…