టాలీవుడ్లో నిన్నటితరం టాప్ స్టార్లలో ఒకడు అక్కినేని నాగార్జున. ఐతే ఆయన తరంలో మిగతా టాప్ స్టార్ల పరిస్థితి మెరుగ్గానే ఉండగా.. నాగ్ మాత్రం తడబడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టాడు. ‘సైరా’తోనూ ఓకే అనిపించారు. ‘ఆచార్య’ డిజాస్టర్ అయినా.. వెంటనే పుంజుకుని ‘గాడ్ ఫాదర్’తో సత్తా చాటుతున్నారు. నందమూరి బాలకృష్ణ వరుసగా కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నప్పటికీ ‘అఖండ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఇక విక్టరీ వెంకటేష్ నిలకడగా విజయాలు అందుకుంటూనే ఉన్నాడు. ‘ఎఫ్-2’తో కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు.
కానీ నాగార్జున మాత్రం నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో 2016లో బ్లాక్బస్టర్ అందుకున్నాక నాగ్కు సరైన విజయం లేదు. ఏ హీరోకైనా ఫ్లాపులు సహజమే కానీ.. నాగ్ పరిస్థితి మాత్రం ఘోరం. ‘ఆఫీసర్’ సినిమా చేసి తన మార్కెట్ను దారుణంగా దెబ్బ తీసుకున్న నాగ్.. ఆ తర్వాత పుంజుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించలేదు.
సినిమా సినిమాకూ నాగ్ మార్కెట్ పడిపోతుండడం.. కనీసం ఓపెనింగ్స్ కూడా కరవైపోతుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ‘వైల్డ్ డాగ్’ ఆడలేదంటే కరోనా కారణం చెప్పారు కానీ.. ఇప్పుడు ‘ది ఘోస్ట్’ దసరా సీజన్లో రిలీజై కూడా ఓ మోస్తరు స్థాయిలోనూ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో పరిస్థితి మరీ కష్టంగా ఉంది. ఫుల్ రన్లో ఆరేడు కోట్లకు మించి షేర్ వచ్చేలా లేదు.
ఒకప్పుడు మిగతా స్టార్లతో సమానంగా తిరుగులేని విజయాలందుకున్న నాగ్.. ఇప్పుడీ పరిస్థితి రావడం అనూహ్యం. ఆయనేమీ యంగ్ హీరోలకు పోటీగా నిలవాల్సిన పని లేదు. కానీ తన తరం స్టార్లకు ఏమాత్రం దీటుగా నిలవలేకపోతున్నాడు. పెద్దగా ఇమేజ్ లేని హీరోలకు, ఆయనకు తేడా లేకపోతోంది. కెరీర్లో అతి పెద్ద మైలురాయి అయిన వందో సినిమా ముంగిట నాగార్జున ఈ స్థితిలో ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వందో సినిమాకు అయినా క్రేజ్ వస్తుందా అన్నది సందేహంగానే ఉంది.
This post was last modified on October 8, 2022 3:19 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…