తమిళ స్టార్ హీరో సూర్య నిఖార్సయిన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. అతడి చివరి థియేట్రికల్ రిలీజ్ ఈటి డిజాస్టర్ అయింది. దానికి ముందు అతడి నుంచి వచ్చిన సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది కానీ.. అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావడం, థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం వల్ల దాని సక్సెస్ను పరిగణనలోకి తీసుకోలేం. జై భీమ్ సినిమా పరిస్థితి కూడా అంతే. అంతకుముందు వరుసగా బాక్సాఫీస్ దగ్గర పరాజయాలే ఎదురయ్యాయి సూర్యకు.
ఐతేనేం అతడి కొత్త సినిమాలకు క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటు శౌర్యం శివ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు కూడా హైప్ ఒక రేంజిలో ఉంది. శివ-సూర్య సినిమా ఈ మధ్యే సెట్స్ మీదికి వెళ్లింది. దాని షూటింగ్ ఆరంభ దశలోనే ఉంది. అప్పుడే దానికి డిజిటల్ డీల్ పూర్తయినట్లుగా వార్తలొస్తున్నాయి.
సూర్య 42వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏకంగా రూ.100 కోట్లకు డిజిటల్ డీల్ కుదిరిందట.ఒక ప్రముఖ ఓటీటీ ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. వరుసగా హిట్లు కొడుతున్న హీరోల సినిమాలకు కూడా లేని డిమాండ్ సూర్య చిత్రాలకు ఉందని.. అతడి సినిమాల డిజిటల్ రీచ్ వేరని, అందుకే వాటి కోసం ఓటీటీలు ఎగబడుతున్నాయని సూర్య అభిమానులు అంటున్నారు.
విక్రమ్ మూవీలో చిన్న క్యామియోతోనే థియేటర్లను షేక్ చేసిన సూర్య.. శివ లాంటి మాస్ డైరెక్టర్తో జట్టు కట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న భారీ కథతో తెరకెక్కుతుండడం విశేషం. సూర్య సరసన దిశా పటాని నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on October 8, 2022 10:15 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…