మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ధృవ ఒకటి. ఒక దశలో వరుసగా మూస మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన చరణ్.. ఈ సినిమాతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. తమిళంలో బ్లాక్బస్టర్ అయిన తనీ ఒరువన్ ఆధారంగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో చరణ్ లుక్, ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్, నటన అందరినీ ఆకట్టుకున్నాయి. దీని ఒరిజినల్ అయిన తనీ ఒరువన్ను డైరెక్ట్ చేసింది మోహన్ రాజా.
అప్పటిదాకా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చిన మోహన్ రాజా.. ఈ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడతను మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ఫాదర్ చేశాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దీని తర్వాత అతను అక్కినేని నాగార్జున హీరోగా ఓ సినిమా చేసే అవకాశాలున్నట్లు సంకేతాలిచ్చాడు.
దీంతో పాటుగా రామ్ చరణ్తో ధృవ-2 చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గాడ్ఫాదర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్.. ధృవ-2 గురించి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు స్వయంగా మోహన్ రాజానే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. తనీ ఒరువన్-2 కోసం ఇప్పటికే కథ సిద్ధమైందని, తన తమ్ముడు జయం రవికి కథ వినిపించానని, అతను ఓకే చెప్పాడని.. అలాగే రామ్ చరణ్కు సైతం ఈ కథ చెప్పానని, అతను కూడా ఆసక్తి చూపించాడని మోహన్ రాజా తెలిపాడు. తనీ ఒరువన్ కంటే ఈ కథ ఇంకా బాగుంటుందని, కాబట్టి తమిళంతో పాటు తెలుగులోనూ సీక్వెల్ చేయడం పక్కా అన్నట్లుగా మాట్లాడాడు మోహన్ రాజా.
ఐతే ప్రస్తుతం రామ్ చరణ్ లైన్లో మూణ్నాలుగు సినిమాలు ఉన్నట్లున్నాయి. మోహన్ రాజా కూడా ఫ్రీ అవ్వడానికి టైం పట్టొచ్చు. కాబట్టి భవిష్యత్తులో వీరి కలయికలో ధృవ-2 రావడం పక్కా అనుకోవచ్చు.
This post was last modified on October 8, 2022 10:11 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…