నిజమే, పొన్నియన్ సెల్వన్ 1 సినిమాకు ఏకంగా 300 కోట్ల కలక్షన్ వచ్చేసింది. అందులో 80% పైచిలుకు కలక్షన్ తమిళ వెర్షన్ నుండి వచ్చిందే. కాని ఆదిపురుష్ సినిమా టీజర్ కు వచ్చిన ట్రాలింగ్ గురించి ప్రస్తావించిన దిల్ రాజు, పెద్ద తెర మీద విజువల్ ఫీస్ట్ ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో పొన్నియన్ సెల్వన్ నిరూపించింది కదా అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇప్పుడు ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ అయిపోతోంది. ఎందుకంటే PS1 ఎందుకు ఆడుతుందో తెలుసుకోలేనంత అమాయక ప్రజాలు ఇప్పుడెక్కడున్నారు చెప్పండి?
విజువల్స్ అద్భుతంగా ఉండటం వలనే పొన్నియన్ సెల్వన్ కుమ్మేస్తుంటే.. ఆ కుమ్ముడు తెలుగులోనూ బాలీవుడ్లోనూ కనిపించేది కదా.? కాని ఇక్కడ అంత సినిమా లేదు. మణిరత్నం మీద అభిమానంతో.. అలాగే ఆ స్టార్ క్యాస్ట్ చూసి.. మన దగ్గర మ్యాగ్జిమం ఒక 10 కోట్ల షేర్ వచ్చే ఛాన్సుంది. హిందీలో అయితే సినిమా అసలు అత్తపత్తా లేకుండా పోయింది. మరి విజువల్స్ బాగుంటే సినిమా ఎందుకు ఆడట్లేదు? విజువల్స్ అంత బాగుంటే ఇక్కడ తెలుగులో కూడా కెజిఎఫ్ లేదా విక్రమ్ సినిమాల తరహాలో కుమ్మేసి వదిలేయాలి. ఇప్పుడు దిల్ రాజ్ చేసిన కామెడీ చూశాక ఈ ప్రశ్నను ఆయన్ను ఎవరైనా అడిగితే బాగుండు అనిపిస్తోంది కదూ.
తమిళంలో పొన్నియన్ సెల్వన్ అక్కడి రాజు చరిత్ర అంటూ గాట్టిగానే ప్రచారం చేశారు. పైగా అక్కడ శైవులు ఎక్కువ. వాళ్లకు రాజరాజ చోళ అంటే.. మహారాష్ట్రలో శివాజీని ఎలాగైతే శివాజీ మహారాజ్ అంటూ దేవుడ్ని చేసేశారో.. అదే తరహాలో తమిళులకు కూడా రాజరాజ చోళ దాదాపు గాడ్ అనే చెప్పాలి.
అందుకే ఆయన కథేంటో తెలుసుకుందాం అని సినిమాకు ఒక్కొక్కరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. రేపు ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కు కూడా.. రామాయణం చూద్దాం అని ధియేటర్లకు ప్రేక్షకులు భారీగా వచ్చే ఛాన్సుంది. అంతమాత్రాన సినిమా విజువల్స్ అదిరిపోయాయ్ అనుకుంటే ఎలా? ఒక్కోసారి విజువల్స్ కంటే ఎమోషన్ కే ఎక్కువ బేరం ఉంటుంది రాజు గారూ!!
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…