Adipurush
గత ఆదివారం రోజు ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి దాని మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్తో పాటు రావణుడు, ఆంజనేయుడు పాత్రలకు సంబంధించిన లుక్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రావణుడు, ఆంజనేయుడు పాత్రల వేషధారణ విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు, హిందూ వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఐతే ఒక హిందీ టీవీ ప్రోగ్రాంలో దర్శకుడు ఓం రౌత్ ఈ విమర్శలన్నింటి మీదా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రామాయణ గాథను ఇప్పటి యువతరం, పిల్లలకు అర్థమయ్యేలా, వారి అభిరుచికి తగ్గట్లు చెప్పాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని అతను వివరించాడు.
రామాయణ గాథను గతంలో అనేక సినిమాలు, సీరియళ్లలో అప్పటి ట్రెండుకు తగ్గట్లు చూపించారని.. ఐతే ఇప్పటి ప్రేక్షకులు హారీ పోర్టర్ లాంటి హాలీవుడ్ సినిమాలకు అలవాటు పడ్డారని.. వారిని ఆకట్టుకోవడానికి రామాయణ గాథను ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్గా చూపించే ప్రయత్నమే ‘ఆదిపురుష్’లో జరిగిందని అతను వివరించాడు. రావణుడు అంటే రాక్షసుడు, చెడుకు ప్రతీక అని.. ప్రస్తుత కాలంలో ఒక చెడ్డ వ్యక్తి ఎలా ఉంటాడనే ఊహతో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ఓం రౌత్ తెలిపాడు.
ఇక రావణుడి వాహనం పుష్పక విమానం కదా.. మరి హాలీవుడ్ సినిమాల్లో కనిపించే పక్షి మీద రావడం ఏంటనే విమర్శలకు బదులిస్తూ.. పుష్పక విమానం మీదే రావణుడు విహరించినట్లు ఎక్కడా ఆధారం లేదని.. ఆ కాలంలో రకరకాల క్రియేచర్స్ ఉండేవని.. ఎవరి విజన్కు తగ్గట్లు వాళ్లు వాటిని చూపించవచ్చని.. ‘ఆదిపురుష్’ సినిమా రామాయణానికి మోడర్న్ వెర్షన్ లాగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో తాము చేసిన ప్రయత్నం ఇదని ఓం రౌత్ వివరించాడు. ‘ఆదిపురుష్’ ప్రధానంగా పిల్లలు, యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా ఇదని, వారి అభిరుచికి తగ్గట్లు మోడర్న్ స్టయిల్లో సినిమాను తీర్చిదిద్దామని అతను తెలిపాడు.
This post was last modified on October 7, 2022 2:36 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…