గత ఆదివారం రోజు ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి దాని మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్తో పాటు రావణుడు, ఆంజనేయుడు పాత్రలకు సంబంధించిన లుక్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రావణుడు, ఆంజనేయుడు పాత్రల వేషధారణ విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు, హిందూ వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఐతే ఒక హిందీ టీవీ ప్రోగ్రాంలో దర్శకుడు ఓం రౌత్ ఈ విమర్శలన్నింటి మీదా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రామాయణ గాథను ఇప్పటి యువతరం, పిల్లలకు అర్థమయ్యేలా, వారి అభిరుచికి తగ్గట్లు చెప్పాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని అతను వివరించాడు.
రామాయణ గాథను గతంలో అనేక సినిమాలు, సీరియళ్లలో అప్పటి ట్రెండుకు తగ్గట్లు చూపించారని.. ఐతే ఇప్పటి ప్రేక్షకులు హారీ పోర్టర్ లాంటి హాలీవుడ్ సినిమాలకు అలవాటు పడ్డారని.. వారిని ఆకట్టుకోవడానికి రామాయణ గాథను ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్గా చూపించే ప్రయత్నమే ‘ఆదిపురుష్’లో జరిగిందని అతను వివరించాడు. రావణుడు అంటే రాక్షసుడు, చెడుకు ప్రతీక అని.. ప్రస్తుత కాలంలో ఒక చెడ్డ వ్యక్తి ఎలా ఉంటాడనే ఊహతో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ఓం రౌత్ తెలిపాడు.
ఇక రావణుడి వాహనం పుష్పక విమానం కదా.. మరి హాలీవుడ్ సినిమాల్లో కనిపించే పక్షి మీద రావడం ఏంటనే విమర్శలకు బదులిస్తూ.. పుష్పక విమానం మీదే రావణుడు విహరించినట్లు ఎక్కడా ఆధారం లేదని.. ఆ కాలంలో రకరకాల క్రియేచర్స్ ఉండేవని.. ఎవరి విజన్కు తగ్గట్లు వాళ్లు వాటిని చూపించవచ్చని.. ‘ఆదిపురుష్’ సినిమా రామాయణానికి మోడర్న్ వెర్షన్ లాగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో తాము చేసిన ప్రయత్నం ఇదని ఓం రౌత్ వివరించాడు. ‘ఆదిపురుష్’ ప్రధానంగా పిల్లలు, యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా ఇదని, వారి అభిరుచికి తగ్గట్లు మోడర్న్ స్టయిల్లో సినిమాను తీర్చిదిద్దామని అతను తెలిపాడు.
This post was last modified on October 7, 2022 2:36 pm
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…