కొంచెం వయసు మీద పడ్డ, అనారోగ్యంతో ఉన్న సెలబ్రెటీల్ని బతికి ఉండగానే చంపేయడం.. లేదంటే వారి ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు పుట్టించడం సోషల్ మీడియాకు మహా సరదా. ఇలా ఎంతమందిని బతికుండానే నివాళులు అర్పించేశారో లెక్కలేదు. దిగ్గజ గాయని జానకి సహా చాలామంది పెద్ద వాళ్లకు ఇలాంటి అనుభవాలున్నాయి. ఈ మధ్య లెజెండరీ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం గురించి కూడా రకరకాల వార్తలు వచ్చాయి.
ఐతే ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న సంగతి నిజమే అంటూ ఆయన మేనల్లుడు ఉత్తేజ్ స్వయంగా వెల్లడించాడు. సర్జరీ జరిగాక ఆయన బాగానే ఉన్నట్లు కూడా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐతే తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. కాగా.. ఇటీవల మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి రూమర్లు మొదలయ్యాయి.
శస్త్రచికిత్స విజయవంతం కాలేదని.. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై సుద్దాల అశోక్ తేజ స్వయంగా స్పందించారు. ఒక వీడియో ద్వారా తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని.. తాను పూర్తిగా కోలుకుంటున్నానని.. మామూలు స్థితిలోనే ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతే కాదు.. తాను మళ్లీ పాటలు కూడా రాస్తున్నట్లు చెప్పారు.
స్వయంగా వీడియోనే పెట్టడంతో సుద్దాల ఆరోగ్యం గురించి ఇలాంటి ప్రచారాలు కట్టిపెడితే మంచిది. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సుద్దాల ఒకరు. చిరంజీవి సినిమా ‘ఠాగూర్’లో శ్రీశ్రీ కవిత్వ స్ఫూర్తితో ఆయన రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను..’ అంటూ సుద్దాల రాసిన పాటకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఇంకా మరెన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి.
This post was last modified on July 8, 2020 8:48 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…