కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రెండో సీజన్లో ఒక ఎపిసోడ్కు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా రాబోతున్నాడు. బహుశా రెండో సీజన్ ఈ ఎపిసోడ్తోనే మొదలవుతుండొచ్చు. చంద్రబాబు ఈ షోలో పాల్గొన్న విషయాన్ని సస్పెన్స్లాగా ఏమీ టీం దాచి పెట్టట్లేదు. ఇంకా షో మొదలవడానికి ముందే.. షూట్ టైం నుంచే హడావుడి మొదలుపెట్టేసింది.
చంద్రబాబు ఈ షోలో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. చంద్రబాబు స్వయంగా ఆహా అధినేత అల్లు అరవింద్తో ఫాటు ఓటీటీ ప్రధాన సిబ్బంది అందరూ కలిసి మరీ స్వాగతం పలికారు. బాలయ్య-బాబు కలిసి ఈ షోలో బాగానే సందడి చేసినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
షో గెస్ట్ సీట్లో కూర్చునే ముందు చంద్రబాబు ప్రేక్షకులకు అభివాదం చేయడం.. వాళ్లు సీఎం సీఎం అని ఆడిటోరియాన్ని హోరెత్తించడం వీడియోలో కనిపిస్తోంది. తెలుగుదేశం మద్దతుదారులకు ఈ వీడియో మామూలు కిక్కు ఇవ్వట్లేదు. చంద్రబాబు స్థాయికి ఓటీటీలో ప్రసారం అయ్యే ఒక టాక్ షోలో పాల్గొనాల్సిన అవసరం ఉందా అని కొందరికి అనిపించొచ్చు కానీ.. ఇలాంటి సూపర్ హిట్ షోలో పాల్గొనడం వల్ల యూత్కు బాగానే కనెక్ట్ అయ్యే అవకాశముంది.
‘అన్ స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. మామూలుగా పొలిటికల్ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు అంటే వేరు కానీ.. ఇలాంటి షోకు వచ్చి వ్యక్తిగత విషయాలు పంచుకుని సరదాగా గడిపితే చంద్రబాబులోని మరో కోణం జనాలకు తెలుస్తుంది. ఎక్కువమంది అటెన్షన్ లభిస్తుంది. అంతిమంగా పొలిటికల్ ప్రమోషన్కూ ఈ షో బాగానే ఉపయోగపడుతుంది. ఇది బాలయ్య-బాబు కలిసి ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్గా భావించవచ్చు.
This post was last modified on October 4, 2022 6:11 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…