టాలీవుడ్లో మరో టాప్ స్టార్ 100 సినిమాల మైలురాయికి చేరువ అయ్యాడు. ఆయనే.. అక్కినేని నాగార్జున. తన వందో సినిమా గురించి ఆయన గత కొన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాడు. ఇటీవల ఈ సినిమా కోసం నలుగురు దర్శకులు పరిశీలనలో ఉన్నారని.. అందరితోనూ కథా చర్చలు జరుగుతున్నాయని నాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ నలుగురిలో ఒక పేరు మాత్రం ముందు నుంచి బలంగా వినిపిస్తోంది. అతనే.. మోహన్ రాజా. సీనియర్ ఎడిటర్, నిర్మాత, తెలుగువాడు అయిన మోహన్ కొడుకే ఈ మోహన్ రాజా. తమిళంలో చాలా వరకు రీమేక్ సినిమాలతోనే విజయాలందుకున్న మోహన్ రాజా.. స్ట్రెయిట్ సినిమాలైన ‘తనీ ఒరువన్’, ‘వేలైక్కారన్’ సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు మోహన్ రాజా. ఇంతకుముందు అతను ‘హనుమాన్ జంక్షన్’ అనే రీమేక్ మూవీతోనే తెలుగులో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
కాగా ‘గాడ్ ఫాదర్’ విడుదల ముంగిట మీడియాతో మాట్లాడిన జయం రవి.. తెలుగులో తన తర్వాతి సినిమా అక్కినేని నాగార్జునతో ఉండొచ్చని సంకేతాలు ఇచ్చాడు. నాగ్తో ఒక యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నానని.. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు.
దీన్ని బట్టి చూస్తే నాగ్ 100వ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలు మెండుగానే ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రాజెక్టు మీద పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ‘లూసిఫర్’ను రీమక్ చేసి మళ్లీ ఆ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చాలా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దీని గురించి మోహన్ రాజా దగ్గర ప్రస్తావించగా.. ‘లూసిఫర్’తో పోలిస్తే ‘గాడ్ ఫాదర్’లో చాలా మార్పులు చేర్పులు జరిగాయని, సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని.. అందుకే దీన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నామని మోహన్ రాజా వెల్లడించాడు.
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…