టాలీవుడ్లో మరో టాప్ స్టార్ 100 సినిమాల మైలురాయికి చేరువ అయ్యాడు. ఆయనే.. అక్కినేని నాగార్జున. తన వందో సినిమా గురించి ఆయన గత కొన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాడు. ఇటీవల ఈ సినిమా కోసం నలుగురు దర్శకులు పరిశీలనలో ఉన్నారని.. అందరితోనూ కథా చర్చలు జరుగుతున్నాయని నాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ నలుగురిలో ఒక పేరు మాత్రం ముందు నుంచి బలంగా వినిపిస్తోంది. అతనే.. మోహన్ రాజా. సీనియర్ ఎడిటర్, నిర్మాత, తెలుగువాడు అయిన మోహన్ కొడుకే ఈ మోహన్ రాజా. తమిళంలో చాలా వరకు రీమేక్ సినిమాలతోనే విజయాలందుకున్న మోహన్ రాజా.. స్ట్రెయిట్ సినిమాలైన ‘తనీ ఒరువన్’, ‘వేలైక్కారన్’ సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు మోహన్ రాజా. ఇంతకుముందు అతను ‘హనుమాన్ జంక్షన్’ అనే రీమేక్ మూవీతోనే తెలుగులో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
కాగా ‘గాడ్ ఫాదర్’ విడుదల ముంగిట మీడియాతో మాట్లాడిన జయం రవి.. తెలుగులో తన తర్వాతి సినిమా అక్కినేని నాగార్జునతో ఉండొచ్చని సంకేతాలు ఇచ్చాడు. నాగ్తో ఒక యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నానని.. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు.
దీన్ని బట్టి చూస్తే నాగ్ 100వ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలు మెండుగానే ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రాజెక్టు మీద పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ‘లూసిఫర్’ను రీమక్ చేసి మళ్లీ ఆ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చాలా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దీని గురించి మోహన్ రాజా దగ్గర ప్రస్తావించగా.. ‘లూసిఫర్’తో పోలిస్తే ‘గాడ్ ఫాదర్’లో చాలా మార్పులు చేర్పులు జరిగాయని, సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని.. అందుకే దీన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నామని మోహన్ రాజా వెల్లడించాడు.
This post was last modified on October 6, 2022 11:36 am
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…