‘బాహుబలి’ ప్రభాస్ కొత్త సినిమా, ఆదిపురుష్ టీజర్ ఆల్రెడీ రిలీజై ఒక వర్గాన్ని భారీగా అప్సెట్ చేసింది. నాసిరకం గ్రాఫిక్స్ తో ఇదొక టెంపుల్ రన్ గేమ్ తరహాలో ఉందని.. వానరసైన్యం సీన్లన్నీ అచ్చం ప్లానెట్ ఆఫ్ ఏప్స్ సినిమాలో చూసి తక్కువ క్వాలిటీతో రీమేక్ చేసినట్లున్నాయ్ అందరూ ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, సాక్షాత్తూ రామాయణం తీశామని చెబుతున్నప్పుడు.. ప్రభాస్ పోషించిన రాముడి పాత్ర నీలంగానూ, అలాగే సైఫ్ ఆలీ ఖాన్ చేసిన రావణాసురుడి పాత్ర లుక్స్ విషయంలో శివ భక్తుడిగానూ చూపించకపోవడం దారుణం అంటున్నారు.
ఈ తరుణంలో మరో రూమర్ కూడా ఆదిపురుష్ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. సలార్ సినిమా షూట్ కంటే ముందు ప్రభాస్ చాలా బొద్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ పోస్టర్లలో సినిమాలో కూడా ఆ విషయం కనిపిస్తోంది. అయితే ట్రైలర్లో చూసినప్పుడు మాత్రం ఆ బల్క్ బాడీలో ఉన్న ప్రభాస్ కు సిక్స్ ప్యాక్ యాబ్స్ ఉన్నట్లు చూపించారు. అప్పట్లో సల్మాన్ ఖాన్ కోసం సుల్తాన్, ఏక్తా టైగర్ వంటి సినిమాల్లో ఎలాగైతే కండలవీరుడి బుజ్జి పొట్టను తొలిగించి ఆ స్థానంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో సిక్స్ ప్యాక్ తగిలించేశారో ఇప్పుడు ప్రభాస్ కూడా అదే తరహాలో యాడ్ చేశారనే కామెంట్స్ అందుకే వినిస్తున్నాయి.
ఇకపోతే రాముడి పాత్రను పోషించిన దాదాపు హీరోలందరూ పైవస్త్రం ఏదీ ధరించకుండానే కనిపించారు. ఎన్టీఆర్ నుండి శోభన్ బాబు, బాలయ్య వరకు.. అందరూ అదే తరహాలో కనిపించి అలరించారు. కాని ప్రభాస్ మాత్రం కొన్ని సీన్స్ లో టాప్ ఒకటి వేసుకోవడం చూస్తుంటే.. అన్ని సీన్స్ లో సిక్స్ ప్యాక్ యాడ్ చేయడం కుదరదనే.. అలా మ్యానేజ్ చేశారా అని కూడా అనిపిస్తోంది. ఏదేమైనా కూడా, సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలు రిలీజయ్యాక ట్రోలింగ్ కు గురైతే, ఆదిపురుష్ మాత్రం పోస్టర్ అండ్ టీజర్ రిలీజుతోనే ట్రోలర్లకు నోటినుండి ఫుడ్డు చేతినిండా పని పెట్టినట్లయ్యింది.
This post was last modified on October 3, 2022 6:43 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…