త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే దీని బిజినెస్ గురించి తెగ వార్తలు వచ్చేశాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లని.. బిజినెస్ దాని మీద వంద కోట్లు ఎక్కువకే జరుగుతోందని.. బయ్యర్లకు రికార్డు రేట్లు చెబుతున్నారని.. మహేష్-త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ చూపించి ఆడియో హక్కులనే రూ.25-30 కోట్ల మధ్య చెబుతున్నారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి ఈ సినిమా గురించి.
ఐతే ఈ ప్రచారాలన్నింటినీ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఖండించాడు. మామూలుగా చాలామంది సినిమా మేకింగ్ దశలో దాని గురించి ఎక్కువ చేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కానీ.. నాగవంశీ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. తమ సినిమా బిజినెస్ గురించి జరుగుతున్న ప్రచారాలన్నీ అతిశయోక్తులే అని తేల్చేశాడు.
మహేష్-త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కట్లేదని నాగవంశీ ముందుగా క్లారిటీ ఇచ్చాడు. ఇది తెలుగు సినిమా అని తేల్చేశాడు. అలాంటపుడు రూ.300 కోట్ల బిజినెస్ ఎలా జరుగుతుందని అతనన్నాడు. అయినా ఈ సినిమాకు అసలు తాము బిజినెస్సే మొదలుపెట్టలేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. తాము మామూలుగా ప్రొడక్షన్ కొంత అయ్యాక కానీ బిజినెస్ మొదలుపెట్టమని.. ఈ సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అన్నది కూడా తమకు ఇంకా క్లారిటీ లేదని నాగవంశీ తెలిపాడు.
ఇక ఆడియో హక్కుల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు తెలుగు సినిమాల ఆడియో హక్కులు ఐదారు కోట్ల మధ్య పలుకుతున్నాయని.. ‘గాడ్ ఫాదర్’ సినిమా రైట్స్ రూ.6 కోట్లకు అమ్మారని.. అలాంటపుడు 25-30 కోట్లు ఎవరిస్తారని అతను ప్రశ్నించాడు. మొత్తానికి నాగవంశీ మాటల్ని బట్టి చూస్తుంటే మీడియాలో ఈ సినిమా బిజినెస్ గురించి జరుగుతున్న ప్రచారాలన్నీ బుస్సే అని తేలిపోయింది. ఐతే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు వారి కెరీర్లలో రికార్డు బిజినెస్ అయితే కచ్చితంగా జరిగే అవకాశముంది.
This post was last modified on October 3, 2022 12:16 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…