దసరాకు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలకు పోటీగా బరిలోకి దిగుతున్న చిన్న సినిమా.. స్వాతిముత్యం. అంత పెద్ద సినిమాలకు పోటీగా ఒక కొత్త హీరో నటించిన చిన్న సినిమాను రిలీజ్ చేయడానికి కారణం.. తమ చిత్రం మీద ఉన్న నమ్మకమే అంటున్నాడు నిర్మాత నాగవంశీ. దసరా సీజన్కు తగ్గ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వాతిముత్యం అని అతను చెబుతున్నాడు.
కాగా స్వాతిముత్యం ట్రైలర్ చూస్తే ఫన్నీగా అనిపించింది కానీ.. అసలు ఈ సినిమా కథేంటన్నది అర్థం కాలేదు. హీరోకు ఏదో ఒక సమస్య ఉందని చెప్పారు కానీ.. అదేంటో వెల్లడించలేదు. దాన్నో సస్పెన్స్ లాగా దాచిపెట్టారు. కథ మలుపు తిరిగేది ఆ పాయింట్ మీదే అనిపించింది ట్రైలర్ చూస్తే. ఐతే సినిమా రిలీజయ్యే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు నాగవంశీ.
ఈ చిత్రంలో హీరో వీర్య దాతగా కనిపించనున్నాడట. అతడి పెళ్ళికి అదే సమస్యగా మారుతుంది. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. హీరో వీర్య దాత అనగానే అందరికీ హిందీ బ్లాక్బస్టర్ విక్కీ డోనర్యే గుర్తుకు వస్తుంది. ఆయుష్మాన్ ఖురానాను స్టార్ను చేసిన సినిమా అది. ఆ టైంకి వీర్య దానం మీద సినిమా అంటే అందరూ ఆశ్చర్యపోయారు. దీన్ని ప్రేక్షకులు తట్టుకోగలరా అనుకున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ను వల్గారిటీ లేకుండా నీట్గా, హృద్యంగా, వినోదాత్మకంగా చూపించి ప్రేక్షకులను మెప్పించారు. బ్లాక్బస్టర్ విజయాన్నందుకున్నారు.
ఐతే ఇదే చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ డిజాస్టర్ అయింది. ఆ సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియదు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ ధైర్యం చేసి వీర్య దానం నేపథ్యంలో కామెడీ మూవీ తీసినట్లున్నారు. మరి ఈ పాయింట్ను దర్శకుడు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడో, సినిమా ఏమేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఈ నెల 5న స్వాతిముత్యం ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 2, 2022 9:16 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…