ఇప్పటివరకు ఇన్ డైరక్టుగా పంచులేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏకంగా డైరక్టుగా.. సూటిగా సుత్తిలేకుండా ఒక పాయింట్ చెప్పేశారు. ‘ఆచార్య’ సినిమా విషయంలో డైరక్టర్ చెప్పిందే చేశామని, కాబట్టి ఆ ఫెయిల్యూర్ తనను బాధిందచని కామెంట్ చేశారు. కాకపోతే రామ్ చరణ్ తో చేసిన మొదటి సినిమానే ఫెయిలైందంటే.. మరో సినిమా చేసినప్పుడు ఆ ఎక్సయిట్మెంట్ ఉండదని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ ఒక వర్గం ఆడియన్స్ అడుగుతుందేంటంటే.. చిరంజీవి స్థాయి స్టార్ హీరో కేవలం డైరక్టర్ ఒక్కడిదే తప్పు అనడం సబబేనా?
నిజానికి సినిమా సూపర్బ్ గా ఆడాలంటే ముందుగా అదిరిపోయే సాంగ్స్ ఉండాలి. ఎప్పుడూ దేవిశ్రీప్రసాద్ తో వెళ్ళే కొరటాల శివను ఈసారి మణిశర్మను తీసుకోమని చెప్పడమే పెద్ద నెగెటివ్ అయ్యింది. ఒక్క పాటలో కూడా సరైన పస లేదు. అదే విధంగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్లతో విరుచుకుపడే తమన్ ను కూడా తీస్కోకుండా, అవుటాఫ్ ఫామ్ లో ఉన్న మణితో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొట్టించడం సినిమాకు ఇంకా మైనస్సే. ఇవన్నీ కూడా కొరటాల శివ తీస్కున్న డెసిషన్సేనా? అంతే కాదు, చిరంజీవి స్వయంగా స్ర్కిప్ట్ ను చూస్కుంటారు కాబట్టి, అసలు మరీ అంత గుడ్డిగా కొరటలా శివ రాసిన పేలవమైన అవుడ్డేటెడ్ కథను ఎలా నమ్మరనేదే అసలు పాయింట్. చరణ్ అండ్ చిరు ఒక ఫ్రేములో కనిపిస్తారు అనే సింగిల్ పాయింట్ కు ఎక్సయిటయిపోయి కథను ఓకే చేసిన చిరంజీవిది కూడా ఈ విషయంలో తప్పేకదా అంటూ కొందరు మూవీ లవ్వర్స్ కామెంట్ చేస్తున్నారు.
నిజానికి ఆచార్య సినిమా ఫ్లాపైదంటే దానికి కొరటాల శివ ఒక 70% కారణం అయితే పక్కాగా మెగాస్టార్ కూడా ఒక 30% కారణం అనే చెప్పొచ్చు. అయితే హిట్లొచ్చినప్పుడు హీరోలను పొగిడి, ఫ్లాప్ రాగానే డైరక్టర్లను తిట్టే ఫ్యాన్స్ ఉన్నంత కాలం స్టార్ హీరోలు కూడా అదే తరహాలో కామెంట్ చేస్తున్నారే అనే మాట ఇప్పుడు సర్వత్ర వినబడుతోంది. ఈ సమయంలో.. చిరంజీవైనా కొరటాలైనా తమ గొప్పతనాన్ని చాటుకోవాలంటే మాత్రం.. ఇటు గాడ్ ఫాదర్ తో మెగాస్టార్ అటు #ఎన్టీఆర్30తో కొరటాల హిట్లు కొట్టి చూపించాల్సిందే. చూద్దాం ఏమవుతుందో.
This post was last modified on October 2, 2022 12:38 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…