ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికీ ఉన్న బిగ్ క్వశ్చన్ సురేష్ బాబు పరిశ్రమ సమస్యల్లో ఎందుకు కనిపించడం లేదు ? అవును దగ్గుబాటి సురేష్ బాబు గత కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలోనూ జోక్యం చూపడం లేదు. మీడియా ముందుకు కనిపించటం లేదు. అసలు సురేష్ బాబు కి ఏమైంది ? నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో బాగా ఆక్టివ్ గా కనిపించి ప్రమోషన్స్ తో పాటు పరిశ్రమ గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడిన ఆయన ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయుపోయారు ? అసలేం జరిగింది ? ఇవన్నీ డౌట్లకు తొందర్లోనే ఆన్వర్ రానుంది.
సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయం అవుతున్న ‘అహింస’ సినిమా నవంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది. దసరా కి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా టీం మీడియా ముందుకు రాబోతుంది. ఓ ఈవెంట్ ప్లాన్ చేసి టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో సురేష్ బాబు కనిపించడం ఖాయం. కొడుకు డెబ్యూ సినిమా గురించి ఆయన మీడియా ముందుకు వచ్చి కంటెంట్ గురించి ఎలాగో చెప్పకనే చెప్పాలి. అలా కనిపించిన వెంటనే సురేష్ బాబు కి మీడియా నుండి ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే ప్రశ్న ఎదురవుతుంది.
మరి ఆ ప్రశ్నకి సురేష్ బాబు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో ఇండస్ట్రీ విషయాల గురించి ఏం చెప్తారో చూడాలి. సో ఇన్ని రోజులు ఇండస్ట్రీ సమస్యలలో పెద్దగా కనిపించకుండా అలాగే మీడియా ముందుకు రాకుండా ఉన్న సురేష్ బాబు ఎట్టకేలకు అభిరాం అహింస కోసం బయటికి రాక తప్పదు. అలా వచ్చాక అన్నిటి గురించి మాట్లాడక తప్పదు. చూడాలి సురేష్ బాబు మీడియాతో ఏం చెప్తారో ?
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…