ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తారో చెప్పలేం. తాజాగా ఓ కమెడియన్ కూడా సినిమా జనాలకు అలాంటి షాక్ ఇచ్చాడు. ఒక సినిమా డైరెక్ట్ చేసేసి రిలీజ్ కి రెడీ చేస్తూ అందరినీ సర్ ప్రయిజ్ చేస్తున్నాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు నల్ల వేణు.
నటుడుగా వేణు చాలానే సినిమాలు చేశాడు. ముఖ్యంగా తేజ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవాడు. ప్రభాస్ మున్నా లో అతనికి మంచి పాత్ర దక్కింది. ప్రభాస్ వెంటే ఉంటూ ఇలియానా ని ప్రేమించే సన్నివేశాల్లో మంచి కామెడీ పండించాడు. ఆ తర్వాత కమెడియన్ కొన్ని సినిమాలు చేసినా ఆ రేంజ్ పాత్రలు దక్కలేదు. అందుకే ఓ కథ రాసుకొని దర్శకుడిగా మారిపోయాడు.
వేణు మెగా ఫోన్ పట్టడానికి మెయిన్ రీజన్ దిల్ రాజు. అవును కథ నచ్చడంతో దిల్ రాజు రంగంలోకి దిగి ఈ సినిమాను నిర్మించారట. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తెలంగాణా నేపథ్యంలో ఆత్మహత్యల మీద వేణు ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఇంకా కాస్టింగ్ వివరాలు బయటికి రాలేదు కానీ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కి అడిగినవన్నీ సమకూర్చారని తెలుస్తుంది.
త్వరలోనే ఫస్ట్ లుక్ ఆ తర్వాత్ సాంగ్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉంది టీం. మరి కామెడీ పాత్రలకు గుడ్ బై చెప్పేసి మెగా ఫోన్ పట్టేసిన వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మెప్పిస్తే డైరెక్టర్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. సీరియస్ కథ కాబట్టి ఏ మాత్రం క్లిక్ అయినా అవార్డులు కూడా దక్కుతాయి. మరి దర్శకుడిగా వేణు స్టార్ ఎలా ఉందో చూడాలి.
This post was last modified on October 1, 2022 2:11 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…