ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తారో చెప్పలేం. తాజాగా ఓ కమెడియన్ కూడా సినిమా జనాలకు అలాంటి షాక్ ఇచ్చాడు. ఒక సినిమా డైరెక్ట్ చేసేసి రిలీజ్ కి రెడీ చేస్తూ అందరినీ సర్ ప్రయిజ్ చేస్తున్నాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు నల్ల వేణు.
నటుడుగా వేణు చాలానే సినిమాలు చేశాడు. ముఖ్యంగా తేజ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవాడు. ప్రభాస్ మున్నా లో అతనికి మంచి పాత్ర దక్కింది. ప్రభాస్ వెంటే ఉంటూ ఇలియానా ని ప్రేమించే సన్నివేశాల్లో మంచి కామెడీ పండించాడు. ఆ తర్వాత కమెడియన్ కొన్ని సినిమాలు చేసినా ఆ రేంజ్ పాత్రలు దక్కలేదు. అందుకే ఓ కథ రాసుకొని దర్శకుడిగా మారిపోయాడు.
వేణు మెగా ఫోన్ పట్టడానికి మెయిన్ రీజన్ దిల్ రాజు. అవును కథ నచ్చడంతో దిల్ రాజు రంగంలోకి దిగి ఈ సినిమాను నిర్మించారట. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తెలంగాణా నేపథ్యంలో ఆత్మహత్యల మీద వేణు ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఇంకా కాస్టింగ్ వివరాలు బయటికి రాలేదు కానీ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కి అడిగినవన్నీ సమకూర్చారని తెలుస్తుంది.
త్వరలోనే ఫస్ట్ లుక్ ఆ తర్వాత్ సాంగ్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉంది టీం. మరి కామెడీ పాత్రలకు గుడ్ బై చెప్పేసి మెగా ఫోన్ పట్టేసిన వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మెప్పిస్తే డైరెక్టర్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. సీరియస్ కథ కాబట్టి ఏ మాత్రం క్లిక్ అయినా అవార్డులు కూడా దక్కుతాయి. మరి దర్శకుడిగా వేణు స్టార్ ఎలా ఉందో చూడాలి.
This post was last modified on October 1, 2022 2:11 pm
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…