టాలీవుడ్లో దసరా సినిమాల లైనప్ ఖరారైపోయింది. గాడ్ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాలు పండక్కి ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఆ తర్వాతి వారం డ్రై రన్ చూడబోతున్నాం. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. శివకార్తికేయన్-అనుదీప్ కేవీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా ముందుగానే రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దీపావళి రేసులోకి మరో సినిమా వచ్చింది. అదే.. జిన్నా. మంచు విష్ణు హీరోగా సూర్యా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 21నే విడుదల చేయబోతున్నట్లు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా మంచు విష్ణు వెల్లడించాడు.
‘జిన్నా’ను ముందు దసరాకే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఐతే ఆ పండక్కి పోటీ ఎక్కువైపోవడంతో వెనక్కి తగ్గారు. మంచు విష్ణు కెరీర్లో ‘జిన్నా’ చాలా కీలకమైన చిత్రం. అతడి గత చిత్రాలు దారుణమైన ఫలితాలందుకున్నాయి. చివరగా విష్ణు నుంచి వచ్చిన ‘ఓటర్’ ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. అంతకుముందు ‘ఆచారి అమెరికా యాత్ర’ సైతం దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో విష్ణు కొంత కాలం సినిమాలు చేయడమే మానేశాడు.
ఈ గ్యాప్ తర్వాత తనకు ‘దేనికైనా రెడీ’ లాంటి హిట్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి కథతో సూర్యా అనే కొత్ద డైరెక్టర్ దర్శకత్వంలో ‘జిన్నా’ చేశాడు. ఈ చిత్రానికి కోన వెంకట్ రచనా సహకారం అందించడం విశేషం. ఎప్పట్లాగే విష్ణు తన సొంత బేనర్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. విష్ణు సరసన ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ నటించారు. ఈ చిత్రంలో విష్ణు సప్లయర్స్ యజమానిగా నటించాడు. దీని టీజర్ చూస్తే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…