ఇటీవలే శాకుంతలం విడుదల తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఘనంగా అనౌన్స్ చేశారు. ఇంతలో ఏమయిందో కానీ ఉన్నట్టుండి ఇవాళ 3D వెర్షన్ కోసం వాయిదా వేస్తున్నామని, అన్నీ పనులు కాగానే కొత్త డేట్ ఫైనల్ చేస్తామని సోషల్ మీడియాలో చల్లగా చెప్పేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు దర్శక నిర్మాత గుణశేఖర్ ఎక్కడా ఇది త్రీడిలో చేసే ఆలోచన ఉందని మాటవరసకు కూడా అనలేదు. ఇప్పుడు ఇంత సడన్ గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నారనే అనుమానం రావడం సహజం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీని వెనుక పలు కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సమంతా అందుబాటులో లేకపోవడం. వ్యక్తిగత కారణాల వల్ల ఓ రెండు నెలలు బ్రేక్ తీసుకుందనే వార్త వారాల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. దాని ఖండిస్తూ సామ్ ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరోపక్క విజయ్ దేవరకొండ ఖుషిని అందుకే పెండింగ్ లో ఉంచారనే న్యూస్ ప్రచారమయ్యింది. ఆ యూనిట్ సైతం సైలెంట్ గానే ఉండిపోయింది. ఒకవేళ శాకుంతలంని నవంబర్ అనుకుంటే ప్రమోషన్లు చేసే టైంలో సామ్ లేకపోతే చాలా ఇబ్బందవుతుంది. అసలు ఆ మూవీని మార్కెటింగ్ చేస్తోందే తన పేరు మీద.
నిజానికి త్రీడి టెక్నాలజీలో సినిమా తీయాలంటే ముందగానే ప్రిపేర్ అవ్వాలి తప్పించి అప్పటికప్పుడు చేసేది కాదు. రుద్రమదేవికి అప్పట్లో త్రీడి జోడించారు కానీ అదేమంత గొప్పగా అనిపించలేదనే కామెంట్స్ వచ్చాయి. శాకుంతలం బాహుబలిలాగా కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు. అలాంటప్పుడు గుణశేఖర్ ట్రెండ్ కు అనుగుణంగా ఈ ఆలోచన చేశారా లేక పైన చెప్పినట్టు సామ్ పబ్లిసిటీకి అందుబాటులోకి వచ్చాక ఫైనల్ చేద్దామనుకున్నారా వేచి చూడాలి. డిసెంబర్, జనవరిలు క్రేజీ సినిమాలు, ప్యాన్ ఇండియాలతో ప్యాకవుతోంది. మరి శాకుంతలంకు స్పేస్ ఎక్కడ దొరికెనో.
This post was last modified on September 29, 2022 7:54 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…