ఇటీవలే శాకుంతలం విడుదల తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఘనంగా అనౌన్స్ చేశారు. ఇంతలో ఏమయిందో కానీ ఉన్నట్టుండి ఇవాళ 3D వెర్షన్ కోసం వాయిదా వేస్తున్నామని, అన్నీ పనులు కాగానే కొత్త డేట్ ఫైనల్ చేస్తామని సోషల్ మీడియాలో చల్లగా చెప్పేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు దర్శక నిర్మాత గుణశేఖర్ ఎక్కడా ఇది త్రీడిలో చేసే ఆలోచన ఉందని మాటవరసకు కూడా అనలేదు. ఇప్పుడు ఇంత సడన్ గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నారనే అనుమానం రావడం సహజం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీని వెనుక పలు కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సమంతా అందుబాటులో లేకపోవడం. వ్యక్తిగత కారణాల వల్ల ఓ రెండు నెలలు బ్రేక్ తీసుకుందనే వార్త వారాల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. దాని ఖండిస్తూ సామ్ ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరోపక్క విజయ్ దేవరకొండ ఖుషిని అందుకే పెండింగ్ లో ఉంచారనే న్యూస్ ప్రచారమయ్యింది. ఆ యూనిట్ సైతం సైలెంట్ గానే ఉండిపోయింది. ఒకవేళ శాకుంతలంని నవంబర్ అనుకుంటే ప్రమోషన్లు చేసే టైంలో సామ్ లేకపోతే చాలా ఇబ్బందవుతుంది. అసలు ఆ మూవీని మార్కెటింగ్ చేస్తోందే తన పేరు మీద.
నిజానికి త్రీడి టెక్నాలజీలో సినిమా తీయాలంటే ముందగానే ప్రిపేర్ అవ్వాలి తప్పించి అప్పటికప్పుడు చేసేది కాదు. రుద్రమదేవికి అప్పట్లో త్రీడి జోడించారు కానీ అదేమంత గొప్పగా అనిపించలేదనే కామెంట్స్ వచ్చాయి. శాకుంతలం బాహుబలిలాగా కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు. అలాంటప్పుడు గుణశేఖర్ ట్రెండ్ కు అనుగుణంగా ఈ ఆలోచన చేశారా లేక పైన చెప్పినట్టు సామ్ పబ్లిసిటీకి అందుబాటులోకి వచ్చాక ఫైనల్ చేద్దామనుకున్నారా వేచి చూడాలి. డిసెంబర్, జనవరిలు క్రేజీ సినిమాలు, ప్యాన్ ఇండియాలతో ప్యాకవుతోంది. మరి శాకుంతలంకు స్పేస్ ఎక్కడ దొరికెనో.
This post was last modified on September 29, 2022 7:54 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…