అసలే ఇది సోషల్ మీడియా కాలం. కొత్త సినిమా ఏదైనా రిలీజ్ రోజు పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రసాద్ ఐమ్యాక్స్ 8.45 షో పూర్తవ్వడం ఆలస్యం దాని తాలూకు టాక్ ప్రపంచమంతా పాకిపోతోంది. అక్కడే కాదు ఈ మధ్య బిసి సెంటర్స్ లో కూడా మైకులు పెట్టి మరీ మొదటి ఆట నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్ తో రివ్యూలు చెప్పిస్తున్నాయి యూట్యూబ్ ఛానల్స్. వీటి ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పలేం కానీ అంతో ఇంతో ఉన్న మాట వాస్తవం. అలాంటిది ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. రాజమౌళి అంతటి వాడే ఆర్ఆర్ఆర్ కు ఆ సాహసం చేయలేకపోయారు.
కానీ బెల్లంకొండ గణేష్ ని హీరోగా లాంచ్ చేస్తున్న స్వాతిముత్యం నిర్మాతలు ఆ రిస్క్ కి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 4 సాయంత్రమే కొన్ని ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేసే నిర్ణయం తీసుకున్నారట. ఎలాగూ పండగ రోజు చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ హడావిడే ఉంటుంది కాబట్టి ఈ మూవీ మీద జనం దృష్టి అంతగా ఉండదు. అలా కాకుండా ముందస్తుగా టాక్ పాజిటివ్ గా బయటికి వెళ్తే చిరు నాగ్ కు టికెట్లు దొరకని ఫ్యామిలీస్ దీనికి వచ్చే అవకాశం ఉంటుంది. అసలే దసరా మూడ్ కాబట్టి థియేటర్లకొచ్చే పబ్లిక్ భారీగా ఉంటుంది.
ఈ మధ్య మేజర్, 777 ఛార్లీకి ఇలాగే చేస్తే బ్రహ్మాండమైన ఫలితం దక్కింది. విరాట పర్వం సైతం మీడియాకు ప్రదర్శించారు కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం దక్కలేదు. కానీ స్వాతిముత్యం ఎంటర్ టైనర్ జానర్ లో తీశారు కాబట్టి ఆ నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్ మరీ ఎక్స్ ట్రాడినరీగా అనిపించలేదు కానీ ఫన్ ఉందనే గ్యారెంటీ అయితే దక్కింది. అర్జున్ రెడ్డి టైంలోనూ ఇలాగే చేశారు. మాములు రెస్పాన్స్ రాలేదు. దెబ్బకు రిలీజ్ రోజు షోలు ఫుల్ అయ్యాయి. స్వాతిముత్యంకు అంత బజ్ లేదు కానీ అన్ని కోణాల్లో అలోచించి ఈ స్టెప్పు తీసుకుంటున్నారు కాబట్టి చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో.
This post was last modified on September 29, 2022 6:46 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…