ఏళ్ళ తరబడి స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసి విడుదల కోసం రెండు సంవత్సరాలకు పైగా ఎదురు చూసిన లాల్ సింగ్ చడ్డా అమీర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగలడమే కాదు బాలీవుడ్ బయ్యర్లకు ఇప్పుడప్పుడే మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. నష్టాలను కొంత వరకు భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ అవెంత నెరవేరాయో బయటికి రాలేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఇంత కాలానికి బాలీవుడ్ డెబ్యూ చేసిన మన నాగ చైతన్యకు కూడా ఇది బ్యాడ్ లాంచ్ గా మిగిలిపోవడం అక్కినేని ఫ్యాన్స్ కి ఇంకా బాధ కలిగించింది. ఇప్పట్లో దాన్ని మర్చిపోవడం కష్టమే.
ఎప్పుడో 90 దశకంలో వచ్చిన ఫారెస్ట్ గంప్ ని ఖంగాళీ చేసుకున్న తర్వాత కూడా అమీర్ ఖాన్ కు ఫారిన్ రీమేకుల మీద మనసు పోలేనట్టుంది. తిరిగి ఇంకో విదేశీ చిత్రాన్ని ఎంచుకున్నాడని ముంబై టాక్. 2018లో వచ్చిన స్పానిష్ మూవీ క్యాంపియన్స్ ని హిందీలో చేయబోతున్నాడట. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ శంకర్ ఎహసాన్ లాయ్ త్రయంతో ఆల్రెడీ మొదలయ్యాయని సమాచారం. దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న. ఇతను గతంలో శుభ్ మంగళ్ సావధాన్ అనే ఎంటర్ టైనర్ తీశాడు. కేవలం పాతిక కోట్లతో తీస్తే డెబ్భై కోట్లు రాబట్టిన సూపర్ హిట్ ఇది.
అందుకే అతనికే ఈ బాధ్యతలు అప్పగించారని తెలిసింది. ఇదో కామెడీ డ్రామా. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు. యాక్షన్ ఎలిమెంట్స్ అసలే లేవు. అయినా అమీర్ దీన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏముందో తెలియాలంటే అది వచ్చే దాకా ఆగాలి. 2023 జనవరిలో స్టార్ట్ అవుతుందట. ఈసారి ఎంత టైం తీసుకుంటారో చూడాలి. అయినా రీమేకుల ప్రవాహం హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లో ఉన్నదే కానీ మన ఆడియన్స్ నేటివిటీకి తగ్గట్టు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని దిగితే బాగుంటుంది. లేదంటే లాల్ సింగ్ చడ్డాలు రిపీట్ అవుతూనే ఉంటాయి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…