Movie News

పొన్నియన్ తారల పారితోషికాలు

రోజుల నుంచి పొన్నియన్ సెల్వన్ 1 విడుదల గంటల్లోకి మారిపోయింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు తమిళనాడులో బాహబలి రేంజ్ ఫీవర్ దీనికి కనిపిస్తోంది. తెల్లవారుఝాము నాలుగు గంటల షోలకే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు మణిరత్నం ఈసారి ఓ రేంజ్ లో దూసుకుపోయేలా ఉన్నారు. అయితే ఇతర డబ్బింగ్ వెర్షన్లకు ఇంత దూకుడు కనిపించడం లేదు. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలు మినహాయించి చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా సాగుతున్నాయి. రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంటే ఊపందుకుంటాయి.

ఇక దీని బడ్జెట్ కు సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. యూనిట్ చెప్పిన ప్రకారమే రెండు భాగాలకు కలిపి అయిదు వందల కోట్ల దాకా ఖర్చయ్యిందట. కేవలం అయిదు నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ సమయం పట్టింది. ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న మల్టీస్టారర్ లో రెమ్యునరేషన్ల గురించి ప్రశ్నలు తలెత్తడం సహజం. చెన్నై టాక్ ప్రకారం ఈ మొత్తం సుమారు 50 కోట్లకు పైమాటే ఉంటుందని అంటున్నారు. ఆయా నటీనటుల కెరీర్లలో అత్యధికంగా ఎంత తీసుకున్నారో అంతా ఇచ్చారట.

వాటి ప్రకారం విక్రమ్ 12 కోట్లు, ఐశ్వర్య రాయ్ 10 కోట్లు, జయం రవి 8 కోట్లు, కార్తీ 5 కోట్లు, త్రిష 2.5 కోట్లు, ఐశ్వర్య లక్ష్మి 1.5 కోట్లు, ప్రభు 1.25 లక్షలు, శోభిత ధూళిపాళ 1 కోటి, ప్రకాష్ రాజ్ 1 కోటి, శరత్ కుమార్ 1 కోటి ఇలా మెయిన్ క్యాస్టింగ్ కే 44 కోట్లకు పైమాటే అయ్యింది. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్, వేలాది జూనియర్ ఆర్టిస్టులు, వందలాది సాంకేతిక నిపుణులు, నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్ వగైరా కలిపితే ఎంతవుతుందో ఠక్కున చెప్పడం కష్టం. బ్లాక్ బస్టర్ కొట్టిందా అంతకంతా వెనక్కు వస్తుంది కానీ లేదంటేనే చిక్కు. చూద్దాం ఇంకొద్ది గంటల్లో మణిరత్నం మేజిక్ పని చేసిందో లేదో తేలపోతుంది.

This post was last modified on September 28, 2022 10:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago