రోజుల నుంచి పొన్నియన్ సెల్వన్ 1 విడుదల గంటల్లోకి మారిపోయింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు తమిళనాడులో బాహబలి రేంజ్ ఫీవర్ దీనికి కనిపిస్తోంది. తెల్లవారుఝాము నాలుగు గంటల షోలకే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు మణిరత్నం ఈసారి ఓ రేంజ్ లో దూసుకుపోయేలా ఉన్నారు. అయితే ఇతర డబ్బింగ్ వెర్షన్లకు ఇంత దూకుడు కనిపించడం లేదు. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలు మినహాయించి చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా సాగుతున్నాయి. రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంటే ఊపందుకుంటాయి.
ఇక దీని బడ్జెట్ కు సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. యూనిట్ చెప్పిన ప్రకారమే రెండు భాగాలకు కలిపి అయిదు వందల కోట్ల దాకా ఖర్చయ్యిందట. కేవలం అయిదు నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ సమయం పట్టింది. ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న మల్టీస్టారర్ లో రెమ్యునరేషన్ల గురించి ప్రశ్నలు తలెత్తడం సహజం. చెన్నై టాక్ ప్రకారం ఈ మొత్తం సుమారు 50 కోట్లకు పైమాటే ఉంటుందని అంటున్నారు. ఆయా నటీనటుల కెరీర్లలో అత్యధికంగా ఎంత తీసుకున్నారో అంతా ఇచ్చారట.
వాటి ప్రకారం విక్రమ్ 12 కోట్లు, ఐశ్వర్య రాయ్ 10 కోట్లు, జయం రవి 8 కోట్లు, కార్తీ 5 కోట్లు, త్రిష 2.5 కోట్లు, ఐశ్వర్య లక్ష్మి 1.5 కోట్లు, ప్రభు 1.25 లక్షలు, శోభిత ధూళిపాళ 1 కోటి, ప్రకాష్ రాజ్ 1 కోటి, శరత్ కుమార్ 1 కోటి ఇలా మెయిన్ క్యాస్టింగ్ కే 44 కోట్లకు పైమాటే అయ్యింది. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్, వేలాది జూనియర్ ఆర్టిస్టులు, వందలాది సాంకేతిక నిపుణులు, నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్ వగైరా కలిపితే ఎంతవుతుందో ఠక్కున చెప్పడం కష్టం. బ్లాక్ బస్టర్ కొట్టిందా అంతకంతా వెనక్కు వస్తుంది కానీ లేదంటేనే చిక్కు. చూద్దాం ఇంకొద్ది గంటల్లో మణిరత్నం మేజిక్ పని చేసిందో లేదో తేలపోతుంది.
This post was last modified on September 28, 2022 10:15 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…