మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ప్రమోషన్లు అంతంత మాత్రంగా అనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాయలసీమ ప్రాంతాన్ని ఎన్నుకుని గ్రాండ్ గా జరిపిన వేడుకలో ఎట్టకేలకు లాంచ్ జరిగిపోయింది. హైప్ పెరగడం తగ్గడం పూర్తిగా దీని మీదే ఆధారపడిన తరుణంలో ఇది ఎలా ఉండబోతోందన్న యాంగ్జైటీ సగటు మూవీ లవర్స్ లోనూ ఉంది. ఆచార్య తాలూకు గాయాలను పూర్తిగా మాన్పుతుందన్న ఫ్యాన్స్ నమ్మకాన్ని ఇది నిలబెట్టాలని మెగా ఫ్యాన్స్ కోరుకున్నారు.
ఒరిజినల్ మలయాళం వెర్షన్ ఆల్రెడీ ఓటిటిలో ఉంది కాబట్టి ఈ వీడియోలో కథను దాచే ప్రయత్నం ఏదీ చేయలేదు. రూలింగ్ పార్టీ జన జాగృతి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చనిపోతే ఆ కుర్చీ మీద అందరి కళ్ళు పడతాయి. కానీ ఆ పదవి దుష్టుల పరం కాకుండా చూసేందుకు రంగంలోకి దిగుతాడు బ్రహ్మ(చిరంజీవి). సిఎం కుటుంబంలో ముసలానికి కారణమైన అల్లుడి(సత్యదేవ్)భరతం పట్టడంతో పాటు తన చెల్లెలి(నయనతార)ని చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాడు. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు, జైలుకు వెళ్లే సంఘటనలు, కుట్రలు కుతంత్రాలు వెరసి గాడ్ ఫాదర్. .
మొత్తానికి ఫ్యాన్స్ ఏది కోరుకున్నారో దాన్ని కంప్లీట్ గా ఎలివేషన్స్ ప్యాకేజ్ తో ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహన్ రాజా. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్ కాదు కానీ విజువల్స్ కు తగ్గట్టు సింక్ అయ్యేలా సాగింది. కీలకమైన ఎపిసోడ్లను పెద్దగా మార్పులు లేకుండానే చేసినట్టు కనిపిస్తోంది. లూసిఫర్ లో ఉన్న టోవినో థామస్ పాత్ర తీసేశారనే టాక్ నిజమే. పూరి జగన్నాధ్ లాంటి ఒకరిద్దరిని తప్ప అందరిని రివీల్ చేశారు. చివరిలో సల్మాన్ ఖాన్ చిరుల స్టెప్పులు, యాక్షన్ బిట్లు అదనపు బోనస్. లక్ష్మి భూపాల డైలాగులు పేలాయి. మొత్తానికి గాడ్ ఫాదర్ అంచనాలకు తగ్గట్టుగానే అనిపిస్తోంది మరి.
This post was last modified on September 28, 2022 8:26 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…