Movie News

వెయ్యి కోట్ల పారితోషకం.. సల్మాన్ రెస్పాన్స్


ప్రస్తుతం ఇండియాలో సినిమాలు, అలాగే రియాలిటీ షోలు, ఇంకా ప్రకటనల కోసం అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఎప్పట్నుంచో తాను నడిపిస్తున్న బిగ్ బాస్ షోకు సంబంధించి సల్మాన్ వందల కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు కొన్నేళ్ల నుంచి. గత సీజన్‌కు అతను రూ.300 కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. దానికే అందరూ ముక్కున వేలేసుకున్నారు. బిగ్ బాస్ షోకు ఎంత రీచ్ ఉన్నప్పటికీ.. మరీ ఇంత పారితోషకమా అని అంతా ఆశ్చర్యపోయారు.

ఐతే ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజన్‌కు ఏకంగా రూ.1000 కోట్ల మేర సల్మాన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా మీడియాలో ఒక హాట్ రూమర్ మొదలైంది. దీనిపై స్వయంగా సల్మాన్ స్పందించాడు. ఆ ప్రచారాన్ని ఖండించారు. మీడియాలో ప్రచారంలో ఉన్న ఫిగర్‌తో పోలిస్తే అందులో నాలుగో వంతు కూడా తాను పారితోషకం కింద పుచ్చుకోవట్లేదని సల్మాన్ స్పష్టం చేశాడు.

“నా పారితోషకం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను వెయ్యి కోట్ల పారితోషకం తీసుకుంటే ఇక జీవితంలో పని చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటా. ఎందుకంటే నాకు లాయర్ ఫీజులతో పాటు అనేక రకాల ఖర్చులున్నాయి. అవి నాకెంతో అవసరం. మీరు చెప్పే మొత్తంలో నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే వార్తలను ఇన్‌కం ట్యాక్స్, ఈడీ అధికారులు కూడా చదువుతారని గుర్తుంచుకోవాలి. ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. దీని విషయంలో గతంలో చాలాసార్లు విసిగిపోయి ఇక నేను ఈ షోను హోస్ట్ చేయలేనని చెప్పాను. వాళ్లకు వేరే ఛాయిస్ లేకే నన్నే సంప్రదిస్తూ వచ్చారు. ఒకవేళ వాళ్లకు వేరే ఛాయిస్ ఉంటే నన్ను ఎప్పుడో మార్చేసేవాళ్లు. బిగ్ బాస్‌లో వచ్చే గొడవలు, విమర్శలు నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నాకు అంతకుమించిన సమస్యలు వేరే ఉన్నాయి” అని సల్మాన్ తెలిపాడు.

This post was last modified on September 28, 2022 5:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…

2 hours ago

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన…

4 hours ago

సాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది!

యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…

5 hours ago

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…

6 hours ago

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…

6 hours ago

మీ కోసం కాల్ చేసే గూగుల్.. ‘ఆస్క్ ఫర్ మీ’ AI ప్రయోగం!

రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…

7 hours ago