ప్రస్తుతం ఇండియాలో సినిమాలు, అలాగే రియాలిటీ షోలు, ఇంకా ప్రకటనల కోసం అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఎప్పట్నుంచో తాను నడిపిస్తున్న బిగ్ బాస్ షోకు సంబంధించి సల్మాన్ వందల కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు కొన్నేళ్ల నుంచి. గత సీజన్కు అతను రూ.300 కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. దానికే అందరూ ముక్కున వేలేసుకున్నారు. బిగ్ బాస్ షోకు ఎంత రీచ్ ఉన్నప్పటికీ.. మరీ ఇంత పారితోషకమా అని అంతా ఆశ్చర్యపోయారు.
ఐతే ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజన్కు ఏకంగా రూ.1000 కోట్ల మేర సల్మాన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా మీడియాలో ఒక హాట్ రూమర్ మొదలైంది. దీనిపై స్వయంగా సల్మాన్ స్పందించాడు. ఆ ప్రచారాన్ని ఖండించారు. మీడియాలో ప్రచారంలో ఉన్న ఫిగర్తో పోలిస్తే అందులో నాలుగో వంతు కూడా తాను పారితోషకం కింద పుచ్చుకోవట్లేదని సల్మాన్ స్పష్టం చేశాడు.
“నా పారితోషకం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను వెయ్యి కోట్ల పారితోషకం తీసుకుంటే ఇక జీవితంలో పని చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటా. ఎందుకంటే నాకు లాయర్ ఫీజులతో పాటు అనేక రకాల ఖర్చులున్నాయి. అవి నాకెంతో అవసరం. మీరు చెప్పే మొత్తంలో నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే వార్తలను ఇన్కం ట్యాక్స్, ఈడీ అధికారులు కూడా చదువుతారని గుర్తుంచుకోవాలి. ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. దీని విషయంలో గతంలో చాలాసార్లు విసిగిపోయి ఇక నేను ఈ షోను హోస్ట్ చేయలేనని చెప్పాను. వాళ్లకు వేరే ఛాయిస్ లేకే నన్నే సంప్రదిస్తూ వచ్చారు. ఒకవేళ వాళ్లకు వేరే ఛాయిస్ ఉంటే నన్ను ఎప్పుడో మార్చేసేవాళ్లు. బిగ్ బాస్లో వచ్చే గొడవలు, విమర్శలు నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నాకు అంతకుమించిన సమస్యలు వేరే ఉన్నాయి” అని సల్మాన్ తెలిపాడు.
This post was last modified on September 28, 2022 5:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…