Movie News

2009 డిజాస్టర్ – మళ్ళీ రీరిలీజా

గత రెండు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ రీ రిలీజులతో ఊగిపోతోంది. ప్రేక్షకుల ఆదరణ సైతం అలాగే ఉంది. పోకిరి ఊహించని స్థాయిలో రెండు కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధిస్తే నేనేం తక్కువా అన్నట్టు జల్సా ఏకంగా మూడు కోట్ల మార్కును దాటించి ఔరా అనిపించింది, తాజాగా చెన్నకేశవరెడ్డి ఓవర్సీస్ లోనూ దుమ్ము దులుపుతోంది. ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ ఫిగర్స్ వస్తాయి కాబట్టి ఏ స్థాయి రికార్డులు అందుకుందో వేచి చూడాలి. ఆ మధ్య హైదరాబాద్ లో ఒక్కడుకి సైతం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఘరానా మొగుడుకి హౌస్ ఫుల్స్ పడిన థియేటర్లున్నాయి.

ఇవన్నీ సరే అప్పట్లో జనం మెచ్చినవి డబ్బులు ఇచ్చినవి అనుకోవచ్చు. కానీ డిజాస్టర్లను రీ రిలీజ్ చేయడం మాత్రం జరంత టూ మచ్ అనే చెప్పాలి. ఆ మధ్య ధనుష్ శృతి హాసన్ ల 3ని ఇదే తరహాలో పునఃవిడుదల చేస్తే యూత్ బాగానే ఎగబడి చూశారు. నిజానికది ఫస్ట్ రిలీజ్ అయిన టైంలో వారం రోజులకే డబ్బాలు వెనక్కు వచ్చాయి. ఏదో కొలవెరి పాట వైరల్ కావడం వల్ల ఒక రెండు రోజులు కలెక్షన్లు వచ్చాయి కానీ మ్యాటర్ మరీ వీక్ ఉండటంతో జనం తిరస్కరించారు. కట్ చేస్తే ఇప్పుడొచ్చిన 3 మాత్రం ఇంకా కొన్ని చోట్ల వారం తర్వాత ఆడుతూ ఉండటం అసలు ట్విస్టు.

ఇప్పుడు 2009లో వచ్చిన నితిన్ కళాఖండం అడవిని అక్టోబర్ 14న రీ రిలీజ్ చేస్తారట. హిందీలో అగ్యాత్ గా దీన్ని మల్టీ లాంగ్వేజ్ గా తీశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొదటి ఆటకే జనం బాబోయ్ అన్నారు. షూటింగ్ కోసం అడవికి వెళ్లిన ఓ సినిమా యూనిట్ ని కనిపించని ఓ కిల్లర్ దారుణంగా చంపుతూ ఉంటాడు. అతని ఆట కట్టించడమే ఇందులో పాయింట్. నిడివి కూడా చాలా తక్కువ. 1 గంట 40 నిమిషాల లోపే అయిపోతుంది. ఎంత యుట్యూబ్, ఓటిటిలో లేదన్నంత మాత్రాన ఇలా థియేటర్లో వదిలి మళ్ళీ ఆ గాయం గుర్తు చేయడం ఎందుకని నితిన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. వర్మ వినే టైపు కాదుగా.

This post was last modified on September 28, 2022 6:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

39 minutes ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

1 hour ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

1 hour ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

3 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

4 hours ago

బెంగాల్ కోసం మోదీ ఎంత పరితపించారో

దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…

5 hours ago