ఈ రోజుల్లో పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో చిత్రీకరణ మొదలు కాకుండానే లేదంటే ఆరంభ దశలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. మరికొన్ని రోజులకు టీజర్ లాంచ్ చేయడం జరుగుతోంది. కానీ ‘ఆదిపురుష్’ సినిమా చిత్రీకరణ పూర్తయి దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటిదాకా ఒక్క లుక్ కూడా బయటికి రాలేదు.
సినిమాను అనౌన్స్ చేసినపుడు రిలీజ్ చేసిన యానిమేటెడ్ పోస్టర్లు తప్పితే.. ప్రభాస్ లుక్ ఒక్కటీ బయటికి రాలేదు. ఐతే సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశాక బ్యాంగ్ బ్యాంగ్ ప్రమోషన్లతో హోరెత్తించాలని దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రకారమే అతను అన్ని పనులూ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్ల హోరు మొదలు కాబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్, టీజర్ రెండూ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా కుదిరింది.
అక్టోబరు 2న అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ కాబోతున్నట్లు వస్తున్న సమాచారం నిజమే అని తెలుస్తోంది. తన పెదనాన్న కృష్ణంరాజు మరణం నేపథ్యంలో ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటాడా లేదా అని ముందు సందేహాలు కలిగాయి. ఐతే సినిమా ప్రమోషన్ను ఒకేసారి టాప్ రేంజికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రభాస్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం.
ఇక బాలీవుడ్లో కొందరు ప్రముఖులకు ‘ఆదిపురుష్’ టీజర్ ముందే చూపించారని.. వాళ్లందరూ అందులోని విజువల్స్, ఎఫెక్ట్స్, అన్నింటికీ మించి ప్రభాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయిపోయారని.. టీజర్ చూసి సామాన్య ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ కావడం పక్కా అని.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా టీజర్ పెంచేయబోతోందని బాలీవుడ్లో ఇప్పటికే టాక్ మొదలైంది. ‘ఆదిపురుష్’ను 30కి పైగా భాషల్లో వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…