దసరాకు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’తో పాటు అక్కినేని నాగార్జున మూవీ ‘ది ఘోస్ట్’ కూడా రిలీజవుతోందని తెలిసి.. పండుగ బరిలో నిలవడానికి చిన్న సినిమాలైన ‘స్వాతిముత్యం’, ‘జిన్నా’ నిలవడానికి సిద్ధపడడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘స్వాతిముత్యం’ సినిమాకు ముందు నుంచి దసరా రిలీజ్ ఫిక్స్ అనే చెబుతూ వచ్చారు.
మంచు విష్ణు మూవీ ‘జిన్నా’ కొంచెం లేటుగా రేసులోకి వచ్చింది. ఈ సినిమాను అక్టోబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ.. డిస్ట్రిబ్యూటర్లకు, మీడియాకు హింట్ అయితే ఇచ్చారు. స్వయంగా విష్ణునే ‘అక్టోబరు 5?’ అంటూ ఒక ట్వీట్ కూడా చేశాడు. అది చూసి ఏంటి విష్ణు కాన్ఫిడెన్స్ అనుకున్నారంతా. ఐతే రిలీజ్ చేస్తారో లేదో తర్వాత.. దసరా బరిలో ‘జిన్నా’ అంటే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతోనే విష్ణు అండ్ కో ఇలా చేస్తోందేమో అన్న చర్చ కూడా జరిగింది.
నిజానికి ‘స్వాతిముత్యం’ సినిమా విషయంలోనూ ఇలాంటి సందేహాలే కలిగాయి. కానీ ఆ చిత్ర బృందం థియేట్రికల్ రిలీజ్ కూడా లాంచ్ చేసి నిజంగానే దసరా రేసులో నిలవబోతున్నట్లు స్పష్టం చేసింది. కానీ ‘జిన్నా’ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమా దసరా బరిలో లేదన్నది స్పష్టం.
‘గాడ్ ఫాదర్’ రిలీజ్ విషయంలో సందేహాలు నెలకొనడంతో ‘జిన్నా’ను దసరా రేసులో నిలపాలని విష్ణు సీరియస్గానే ఆలోచించాడు. కానీ చిరు సినిమా పండక్కి ఫిక్సవడంతో ఇంత పోటీ మధ్య ఎందుకని వెనక్కి తగ్గినట్లున్నాడు. ఏదైతేనేం.. ‘జిన్నా’ గురించి గత కొన్ని రోజుల్లో బాగానే చర్చ జరిగింది. సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. విష్ణు గత సినిమాలు దారుణమైన ఫలితాలందుకున్నప్పటికీ ఆ ప్రభావం ‘జిన్నా’ మీద పెద్దగా పడనట్లే ఉంది. ఈ సినిమాకు డీసెంట్ బజ్ కనిపిస్తోంది. అక్టోబరులోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on September 27, 2022 1:48 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…