ఈసారి దసరా పండక్కి ఆసక్తికర బాక్సాఫీస్ సమరం చూడబోతున్నాం. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల సినిమాలు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఆ పండక్కి ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దసరా రోజైన అక్టోబరు 5న వీటితో పాటు స్వాతిముత్యం అనే చిన్న సినిమా కూడా విడుదలవుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడైన బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. అతడి సరసన వర్ష బొల్లమ్మ నటించింది. ఇలాంటి కాంబినేషన్లో లక్ష్మణ్ అనే ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు తీసిన సినిమాను అంత పెద్ద సినిమాలకు పోటీగా దసరా రేసులో దించడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ముందేమో ఇది పబ్లిసిటీ గిమ్మిక్ అయి ఉంటుందని, రిలీజ్ టైం దగ్గర పడేసరికి వెనక్కి తగ్గుతారని అనుకున్నారు. కానీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిత్ర బృందం దసరా రిలీజ్ను కన్ఫమ్ చేసింది. పక్కాగా అక్టోబరు 5నే తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపాడు.
మరి అంత పెద్ద సినిమాలకు పోటీగా ఏ ధైర్యంతో మీరీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని మీడియా వాళ్లు అడిగితే.. నాగవంశీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. అందరూ తమది చిన్న చిత్రం అంటున్నారని, కానీ ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుంచి ఈ సినిమా వస్తోందని మరిచిపోవద్దని.. తమకు బలమైన డిస్ట్రిబ్యూషన్ టీం ఉందని.. అందరం కలిసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పాడు నాగవంశీ. దసరా టైమింగ్కు సరిపోయే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తమ సినిమాకు ప్లస్ అయ్యే అంశమని.. దసరా టైంలో మార్నింగ్ షో చిరంజీవి సినిమా, మ్యాట్నీకి నాగార్జున మూవీ చూసే ప్రేక్షకులు.. ఫస్ట్ షోకు తమ సినిమాకు వస్తారనే నమ్మకం ఉందని అతను వ్యాఖ్యానించాడు.
ఇక బెల్లంకొండ గణేష్ లాంచింగ్ గురించి మాట్లాడుతూ.. తమ కథకు సరిపోయే అమాయకంగా కనిపించే అబ్బాయి కోసం చూస్తుండగా గణేష్ దొరికాడని.. తాము గణేష్ అనే అబ్బాయితో సినిమా చేశాం అనుకుంటున్నామే తప్ప.. ఒక కొత్త హీరోను లాంచ్ చేస్తున్నట్లు అసలు ఫీలవ్వట్లేదని నాగవంశీ స్పష్టం చేశాడు.
This post was last modified on September 26, 2022 10:22 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…