తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సినిమా.. పొన్నియన్ సెల్వన్. వందల కోట్ల ఖర్చుతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు మణిరత్నం. మూడు దశాబ్దాల ముందు నుంచి ఆయన్ని వెంటాడుతున్న ప్రాజెక్టు ఇది. గతంలో రెండు మూడుసార్లు సినిమాను పట్టాలెక్కించడానికి గట్టి ప్రయత్నం చేసి విఫలమైన మణిరత్నం.. ఎట్టకేలకు మూడేళ్ల కిందట ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఐతే తమిళంలో ఈ సినిమాకు ఉన్న హైప్.. మిగతా భాషల్లో లేదు. ‘బాహుబలి’ తరహాలో ఇది దేశవ్యాప్తంగా యుఫోరియా క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం ఆశించింది కానీ.. తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. కానీ అమెరికాలో ఈ సినిమాకు బంపర్ క్రేజ్ కనిపిస్తుండటం విశేషం. యుఎస్ ప్రిమియర్స్ వారం ముందే అక్కడ పెద్ద ఎత్తున టికెట్లు సేల్ అయ్యాయి.
విడుదలకు ఐదు రోజుల ముందే పొన్నియన్ సెల్వన్ హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రి సేల్స్ గత రెండు మూడు రోజుల్లో బాగా పుంజుకున్నాయి. ఐతే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగాయి. తెలుగు, హిందీ వెర్షన్లకు అక్కడ కూడా పెద్దగా హైప్ లేదు. తమిళ జనాలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని.. బాహుబలికి తెలుగులో ఎంత హైప్ ఉందో తమిళం వరకు ఈ చిత్రంపై ఆ స్థాయిలో ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.
రిలీజ్ దగ్గర పడేసరికి ప్రి సేల్స్ ఇంకా పెరుగుతాయని.. ప్రిమియర్స్ మొదలవడానికి ముందే సినిమా మిలియన్ మార్కును టచ్ చేస్తుందని.. ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి 1.5 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు. తమిళనాడులో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇటీవలే ‘విక్రమ్’ సినిమా నెలకొల్పిన ఆల్ టైం రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టేసే అవకాశముంది.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…