Movie News

పొన్నియన్ సెల్వన్.. అక్కడ మోతే

తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సినిమా.. పొన్నియన్ సెల్వన్. వందల కోట్ల ఖర్చుతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు మణిరత్నం. మూడు దశాబ్దాల ముందు నుంచి ఆయన్ని వెంటాడుతున్న ప్రాజెక్టు ఇది. గతంలో రెండు మూడుసార్లు సినిమాను పట్టాలెక్కించడానికి గట్టి ప్రయత్నం చేసి విఫలమైన మణిరత్నం.. ఎట్టకేలకు మూడేళ్ల కిందట ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఐతే తమిళంలో ఈ సినిమాకు ఉన్న హైప్.. మిగతా భాషల్లో లేదు. ‘బాహుబలి’ తరహాలో ఇది దేశవ్యాప్తంగా యుఫోరియా క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం ఆశించింది కానీ.. తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. కానీ అమెరికాలో ఈ సినిమాకు బంపర్ క్రేజ్ కనిపిస్తుండటం విశేషం. యుఎస్ ప్రిమియర్స్ వారం ముందే అక్కడ పెద్ద ఎత్తున టికెట్లు సేల్ అయ్యాయి.

విడుదలకు ఐదు రోజుల ముందే పొన్నియన్ సెల్వన్ హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రి సేల్స్ గత రెండు మూడు రోజుల్లో బాగా పుంజుకున్నాయి. ఐతే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగాయి. తెలుగు, హిందీ వెర్షన్లకు అక్కడ కూడా పెద్దగా హైప్ లేదు. తమిళ జనాలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని.. బాహుబలికి తెలుగులో ఎంత హైప్ ఉందో తమిళం వరకు ఈ చిత్రంపై ఆ స్థాయిలో ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.

రిలీజ్ దగ్గర పడేసరికి ప్రి సేల్స్ ఇంకా పెరుగుతాయని.. ప్రిమియర్స్ మొదలవడానికి ముందే సినిమా మిలియన్ మార్కును టచ్ చేస్తుందని.. ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి 1.5 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు. తమిళనాడులో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇటీవలే ‘విక్రమ్’ సినిమా నెలకొల్పిన ఆల్ టైం రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టేసే అవకాశముంది.

This post was last modified on September 25, 2022 6:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago