తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సినిమా.. పొన్నియన్ సెల్వన్. వందల కోట్ల ఖర్చుతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు మణిరత్నం. మూడు దశాబ్దాల ముందు నుంచి ఆయన్ని వెంటాడుతున్న ప్రాజెక్టు ఇది. గతంలో రెండు మూడుసార్లు సినిమాను పట్టాలెక్కించడానికి గట్టి ప్రయత్నం చేసి విఫలమైన మణిరత్నం.. ఎట్టకేలకు మూడేళ్ల కిందట ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఐతే తమిళంలో ఈ సినిమాకు ఉన్న హైప్.. మిగతా భాషల్లో లేదు. ‘బాహుబలి’ తరహాలో ఇది దేశవ్యాప్తంగా యుఫోరియా క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం ఆశించింది కానీ.. తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. కానీ అమెరికాలో ఈ సినిమాకు బంపర్ క్రేజ్ కనిపిస్తుండటం విశేషం. యుఎస్ ప్రిమియర్స్ వారం ముందే అక్కడ పెద్ద ఎత్తున టికెట్లు సేల్ అయ్యాయి.
విడుదలకు ఐదు రోజుల ముందే పొన్నియన్ సెల్వన్ హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రి సేల్స్ గత రెండు మూడు రోజుల్లో బాగా పుంజుకున్నాయి. ఐతే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగాయి. తెలుగు, హిందీ వెర్షన్లకు అక్కడ కూడా పెద్దగా హైప్ లేదు. తమిళ జనాలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని.. బాహుబలికి తెలుగులో ఎంత హైప్ ఉందో తమిళం వరకు ఈ చిత్రంపై ఆ స్థాయిలో ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.
రిలీజ్ దగ్గర పడేసరికి ప్రి సేల్స్ ఇంకా పెరుగుతాయని.. ప్రిమియర్స్ మొదలవడానికి ముందే సినిమా మిలియన్ మార్కును టచ్ చేస్తుందని.. ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి 1.5 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు. తమిళనాడులో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇటీవలే ‘విక్రమ్’ సినిమా నెలకొల్పిన ఆల్ టైం రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టేసే అవకాశముంది.
This post was last modified on September 25, 2022 6:30 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…