గత నెల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాకు స్పెషల్ షోలు ప్లాన్ చేయడం.. వాటి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 400కు చేరుకోవడం.. వసూళ్లు కోటిన్నర దాటిపోవడం చూసి అంతా ఔరా అనుకున్నారు. కానీ మూడు వారాలు తిరిగేసరికి ఈ రికార్డులన్నీ బద్దలైపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ సినిమాతో షోలు, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పారు అభిమానులు.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల వంతు వచ్చింది. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో శని, ఆదివారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లో భారీ లెవెల్లో షోలు ప్లాన్ చేశారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లు, షోల వరకు రెస్పాన్స్ బాగానే ఉంది కానీ.. పోకిరి, జల్సా సినిమాల స్థాయిలో అయితే దీనికి హంగామా కనిపించట్లేదు. అన్ని షోలూ ఫుల్స్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ వరకు పోకిరి, జల్సా వసూళ్లను ఇది అధిగమించే పరిస్థితి కనిపించడం లేదు.
ఐతే అమెరికాలో మాత్రం ‘చెన్నకేశవరెడ్డి’ సందడి మామూలుగా లేదు. అక్కడ ఏకంగా 32 లొకేషన్లలో 82 స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. ఇప్పటిదాకా రీ రిలీజ్ లో ఏ సినిమాకూ ఇన్ని లొకేషన్లతో ఇంత భారీ స్థాయిలో షోలు పడలేదు. వసూళ్ల పరంగా కూడా పాత రికార్డులన్నీ ఆల్రెడీ బద్దలైపోయాయి. ‘పోకిరి’ మూవీకి యుఎస్ లో రూ.13 లక్షల గ్రాస్ రాగా.. ‘జల్సా’ సినిమా రూ.30 లక్షలతో కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు ఇప్పుడిప్పుడే బద్దలవుతుందని అనుకోలేదు.
కానీ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాతో బాలయ్య అభిమానులు దాన్ని అధిగమించారు. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు అక్కడ రూ.32 లక్షలకు చేరుకుంది. ఐతే దీని వెనుక క్యాస్ట్ యాంగిల్ ఉందని వేరే హీరోల ఫ్యాన్స్ అంటున్నారు. మామూలుగానే బాలయ్య సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు ఆయన సినిమాలను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. థియేటర్లు థియేటర్లు బుక్ చేసి సినిమాలు చూస్తుంటారు. ‘చెన్నకేశవరెడ్డి’కి కూడా బాలయ్య అభిమానులు, టీడీపీ మద్దతుదారులు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని షోలకు షోలు కొనేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 25, 2022 6:29 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…