గత నెల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాకు స్పెషల్ షోలు ప్లాన్ చేయడం.. వాటి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 400కు చేరుకోవడం.. వసూళ్లు కోటిన్నర దాటిపోవడం చూసి అంతా ఔరా అనుకున్నారు. కానీ మూడు వారాలు తిరిగేసరికి ఈ రికార్డులన్నీ బద్దలైపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ సినిమాతో షోలు, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పారు అభిమానులు.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల వంతు వచ్చింది. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో శని, ఆదివారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లో భారీ లెవెల్లో షోలు ప్లాన్ చేశారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లు, షోల వరకు రెస్పాన్స్ బాగానే ఉంది కానీ.. పోకిరి, జల్సా సినిమాల స్థాయిలో అయితే దీనికి హంగామా కనిపించట్లేదు. అన్ని షోలూ ఫుల్స్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ వరకు పోకిరి, జల్సా వసూళ్లను ఇది అధిగమించే పరిస్థితి కనిపించడం లేదు.
ఐతే అమెరికాలో మాత్రం ‘చెన్నకేశవరెడ్డి’ సందడి మామూలుగా లేదు. అక్కడ ఏకంగా 32 లొకేషన్లలో 82 స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. ఇప్పటిదాకా రీ రిలీజ్ లో ఏ సినిమాకూ ఇన్ని లొకేషన్లతో ఇంత భారీ స్థాయిలో షోలు పడలేదు. వసూళ్ల పరంగా కూడా పాత రికార్డులన్నీ ఆల్రెడీ బద్దలైపోయాయి. ‘పోకిరి’ మూవీకి యుఎస్ లో రూ.13 లక్షల గ్రాస్ రాగా.. ‘జల్సా’ సినిమా రూ.30 లక్షలతో కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు ఇప్పుడిప్పుడే బద్దలవుతుందని అనుకోలేదు.
కానీ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాతో బాలయ్య అభిమానులు దాన్ని అధిగమించారు. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు అక్కడ రూ.32 లక్షలకు చేరుకుంది. ఐతే దీని వెనుక క్యాస్ట్ యాంగిల్ ఉందని వేరే హీరోల ఫ్యాన్స్ అంటున్నారు. మామూలుగానే బాలయ్య సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు ఆయన సినిమాలను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. థియేటర్లు థియేటర్లు బుక్ చేసి సినిమాలు చూస్తుంటారు. ‘చెన్నకేశవరెడ్డి’కి కూడా బాలయ్య అభిమానులు, టీడీపీ మద్దతుదారులు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని షోలకు షోలు కొనేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 25, 2022 6:29 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…