Movie News

అఫీషియల్.. బాలయ్య సరసన కొత్తమ్మాయ్

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం మొదలైనప్పటి నుంచి ఇందులో కథానాయిక గురించి కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.

ఐతే ఒక కథానాయికగా అంజలి ఖాయం అంటుండగా.. ఇంకో కథానాయికగా సోనాక్షి సిన్హా నుంచి అమలా పాల్ వరకు ఎన్నో పేర్లు వినిపించాయి. తాజాగా అమలా పాల్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంలో రూమర్లు మరీ ఎక్కువైపోతుండటంతో దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించాడు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కథానాయిక విషయంలో క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య కథానాయికగా ఎవరిని తీసుకుందాం.. స్టార్ హీరోయినా కొత్తమ్మాయా అని పలు విధాలుగా ఆలోచించి చివరికి ఓ కొత్త అమ్మాయిని ఎంచుకున్నట్లు బోయపాటి తెలిపాడు.

ఆ అమ్మాయి ఎవరన్నది ఇప్పుడే వెల్లడించమని.. మంచి సందర్భం చూసి అప్ డేట్ ఇస్తామని బోయపాటి తెలిపాడు. ఇక ఈ చిత్రానికి మోనార్క్ అని.. సూపర్ మ్యాన్ అని.. రకరకాల టైటిళ్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ కూడా ఖరారు చేశారని.. దాన్ని కూడా మంచి అకేషన్ చూసే ప్రకటిస్తారని అంటున్నారు. లాక్ డౌన్ పెట్టడానికి ముందు కేవలం ఐదు రోజుల షూటింగ్ జరిగింది ఈ చిత్రానికి సంబంధించి.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే ముందు ఫైట్‌తో చిత్రీకరణ మొదలుపెట్టడం ఆనవాయితీ. వీళ్ల కలయికలో వస్తున్న మూడో సినిమా విషయంలోనూ అదే సెంటిమెంటు పాటించారు. ఆ రష్ నుంచి ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ కట్ చేసి వదిలారు. దానికి మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ షరతులన్నీ పోయి.. మామూలు పరిస్థితులు నెలకొన్నాక చిత్రీకరణ పున:ప్రారంభించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

This post was last modified on July 7, 2020 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago