Movie News

అఫీషియల్.. బాలయ్య సరసన కొత్తమ్మాయ్

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం మొదలైనప్పటి నుంచి ఇందులో కథానాయిక గురించి కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.

ఐతే ఒక కథానాయికగా అంజలి ఖాయం అంటుండగా.. ఇంకో కథానాయికగా సోనాక్షి సిన్హా నుంచి అమలా పాల్ వరకు ఎన్నో పేర్లు వినిపించాయి. తాజాగా అమలా పాల్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంలో రూమర్లు మరీ ఎక్కువైపోతుండటంతో దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించాడు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కథానాయిక విషయంలో క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య కథానాయికగా ఎవరిని తీసుకుందాం.. స్టార్ హీరోయినా కొత్తమ్మాయా అని పలు విధాలుగా ఆలోచించి చివరికి ఓ కొత్త అమ్మాయిని ఎంచుకున్నట్లు బోయపాటి తెలిపాడు.

ఆ అమ్మాయి ఎవరన్నది ఇప్పుడే వెల్లడించమని.. మంచి సందర్భం చూసి అప్ డేట్ ఇస్తామని బోయపాటి తెలిపాడు. ఇక ఈ చిత్రానికి మోనార్క్ అని.. సూపర్ మ్యాన్ అని.. రకరకాల టైటిళ్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ కూడా ఖరారు చేశారని.. దాన్ని కూడా మంచి అకేషన్ చూసే ప్రకటిస్తారని అంటున్నారు. లాక్ డౌన్ పెట్టడానికి ముందు కేవలం ఐదు రోజుల షూటింగ్ జరిగింది ఈ చిత్రానికి సంబంధించి.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే ముందు ఫైట్‌తో చిత్రీకరణ మొదలుపెట్టడం ఆనవాయితీ. వీళ్ల కలయికలో వస్తున్న మూడో సినిమా విషయంలోనూ అదే సెంటిమెంటు పాటించారు. ఆ రష్ నుంచి ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ కట్ చేసి వదిలారు. దానికి మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ షరతులన్నీ పోయి.. మామూలు పరిస్థితులు నెలకొన్నాక చిత్రీకరణ పున:ప్రారంభించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

This post was last modified on July 7, 2020 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైలెంట్ అయితే ఎలా సామ్

సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…

30 minutes ago

పోరాట యోధుడిగా సల్మాన్ సర్ప్రైజ్

ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…

4 hours ago

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…

6 hours ago

సాయిపల్లవిని చూడ్డానికి కూడా రారా?

ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…

8 hours ago

ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…

9 hours ago

సుకుమార్ ఎంత సమయం తీసుకుంటారో

కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…

13 hours ago