Movie News

అఫీషియల్.. బాలయ్య సరసన కొత్తమ్మాయ్

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం మొదలైనప్పటి నుంచి ఇందులో కథానాయిక గురించి కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.

ఐతే ఒక కథానాయికగా అంజలి ఖాయం అంటుండగా.. ఇంకో కథానాయికగా సోనాక్షి సిన్హా నుంచి అమలా పాల్ వరకు ఎన్నో పేర్లు వినిపించాయి. తాజాగా అమలా పాల్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంలో రూమర్లు మరీ ఎక్కువైపోతుండటంతో దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించాడు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కథానాయిక విషయంలో క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య కథానాయికగా ఎవరిని తీసుకుందాం.. స్టార్ హీరోయినా కొత్తమ్మాయా అని పలు విధాలుగా ఆలోచించి చివరికి ఓ కొత్త అమ్మాయిని ఎంచుకున్నట్లు బోయపాటి తెలిపాడు.

ఆ అమ్మాయి ఎవరన్నది ఇప్పుడే వెల్లడించమని.. మంచి సందర్భం చూసి అప్ డేట్ ఇస్తామని బోయపాటి తెలిపాడు. ఇక ఈ చిత్రానికి మోనార్క్ అని.. సూపర్ మ్యాన్ అని.. రకరకాల టైటిళ్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ కూడా ఖరారు చేశారని.. దాన్ని కూడా మంచి అకేషన్ చూసే ప్రకటిస్తారని అంటున్నారు. లాక్ డౌన్ పెట్టడానికి ముందు కేవలం ఐదు రోజుల షూటింగ్ జరిగింది ఈ చిత్రానికి సంబంధించి.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే ముందు ఫైట్‌తో చిత్రీకరణ మొదలుపెట్టడం ఆనవాయితీ. వీళ్ల కలయికలో వస్తున్న మూడో సినిమా విషయంలోనూ అదే సెంటిమెంటు పాటించారు. ఆ రష్ నుంచి ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ కట్ చేసి వదిలారు. దానికి మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ షరతులన్నీ పోయి.. మామూలు పరిస్థితులు నెలకొన్నాక చిత్రీకరణ పున:ప్రారంభించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

This post was last modified on July 7, 2020 5:00 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

33 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

50 mins ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

2 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

2 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

2 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

2 hours ago