Movie News

జబర్దస్త్‌ను మళ్లీ ఆపేశారా?

లాక్ డౌన్ కారణంగా అన్ని టీవీ కార్యక్రమాల్లాగే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కామెడీ షో ‘జబర్దస్త్’ కూడా ఆగిపోయింది. అప్పటికే చిత్రీకరించిన కొన్ని ఎపిసోడ్లతో ఒకట్రెండు వారాలు బండి నడిచింది కానీ.. ఆ తర్వాత పాత ఎపిసోడ్లతో నడిపిస్తూ వచ్చారు. ఇటీవల టీవీ షూటింగ్‌లన్నీ పున:ప్రారంభ అయిన నేపథ్యంలో ఈ షో కూడా మళ్లీ మొదలైంది.

ఒక వారం షూటింగ్ చేసి తర్వాతి వారం ఎపిసోడ్లు నడిపించారు. రెండో వారం కూడా ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ జరిగింది. ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. కానీ ఇప్పుడీ షోకు మళ్లీ బ్రేక్ పడినట్లు సమాచారం. ఇందుక్కారణం షోలో అత్యంత ఆకర్షణీయమైన హైపర్ ఆది టీంలోనే ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరన్నది వెల్లడి కాలేదు.

కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయింగా.. పాజిటివ్‌గా తేలిందని.. దీంతో మిగతా వాళ్లనూ పరీక్షలకు పంపారని.. అందరూ హోం క్వారంటైన్ అయ్యారని సమాచారం. మరింతమంది కరోనా పాజిటివ్‌గా తేలే అవకాశాలుండటం.. షోను కొనసాగిస్తే బాధితుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఈ షో్కు మళ్లీ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీ సీరియల్స్ చిత్రీకరణలు కూడా చాలా వరకు ఆగిపోయాయి.

నవ్య స్వామి సహా టీవీ ఆర్టిస్టుల పలువురు ఇటీవల కరోనా బాధితులుగా తేలారు. దీంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో ఆందోళన నెలకొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాను ఆపడం సులువు కాదని తేలిపోవడంతో షూటింగ్స్ అన్నీ ఆపేయక తప్పట్లేదు. ఇక టీవీ చిత్రీకరణలకు సంబంధించిన అప్ డేట్స్ చూశాక అసలే వెనుకంజ వేస్తున్న సినిమా బృందాలు.. మరింతగా వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. చూస్తుంటే ఇంకో రెండు నెలలు అన్ని కార్యకలాపాలూ ఆపుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Satya

Recent Posts

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

16 minutes ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

1 hour ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

1 hour ago

త‌మ‌న్‌కు ఇలా షాకిచ్చారేంటి?

సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో త‌మ‌న్ ఒక‌డు. తెలుగు వ‌ర‌కు చూస్తే కొన్నేళ్ల నుంచి అత‌నే నంబ‌ర్ వ‌న్.…

1 hour ago

బహదూర్ VS బంధం – ఆషామాషీ పోటీ కాదు

స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…

3 hours ago