లాక్ డౌన్ కారణంగా అన్ని టీవీ కార్యక్రమాల్లాగే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కామెడీ షో ‘జబర్దస్త్’ కూడా ఆగిపోయింది. అప్పటికే చిత్రీకరించిన కొన్ని ఎపిసోడ్లతో ఒకట్రెండు వారాలు బండి నడిచింది కానీ.. ఆ తర్వాత పాత ఎపిసోడ్లతో నడిపిస్తూ వచ్చారు. ఇటీవల టీవీ షూటింగ్లన్నీ పున:ప్రారంభ అయిన నేపథ్యంలో ఈ షో కూడా మళ్లీ మొదలైంది.
ఒక వారం షూటింగ్ చేసి తర్వాతి వారం ఎపిసోడ్లు నడిపించారు. రెండో వారం కూడా ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ జరిగింది. ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. కానీ ఇప్పుడీ షోకు మళ్లీ బ్రేక్ పడినట్లు సమాచారం. ఇందుక్కారణం షోలో అత్యంత ఆకర్షణీయమైన హైపర్ ఆది టీంలోనే ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరన్నది వెల్లడి కాలేదు.
కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయింగా.. పాజిటివ్గా తేలిందని.. దీంతో మిగతా వాళ్లనూ పరీక్షలకు పంపారని.. అందరూ హోం క్వారంటైన్ అయ్యారని సమాచారం. మరింతమంది కరోనా పాజిటివ్గా తేలే అవకాశాలుండటం.. షోను కొనసాగిస్తే బాధితుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఈ షో్కు మళ్లీ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీ సీరియల్స్ చిత్రీకరణలు కూడా చాలా వరకు ఆగిపోయాయి.
నవ్య స్వామి సహా టీవీ ఆర్టిస్టుల పలువురు ఇటీవల కరోనా బాధితులుగా తేలారు. దీంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో ఆందోళన నెలకొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాను ఆపడం సులువు కాదని తేలిపోవడంతో షూటింగ్స్ అన్నీ ఆపేయక తప్పట్లేదు. ఇక టీవీ చిత్రీకరణలకు సంబంధించిన అప్ డేట్స్ చూశాక అసలే వెనుకంజ వేస్తున్న సినిమా బృందాలు.. మరింతగా వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. చూస్తుంటే ఇంకో రెండు నెలలు అన్ని కార్యకలాపాలూ ఆపుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on July 7, 2020 4:57 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…