దసరా సెలవులు మొదలైపోతున్నాయి. కానీ దసరా సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పండక్కి సరిగ్గా ఇంకో 12 రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఆ వారాంతానికి అనుకుంటున్న సినిమాల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఒక్క అక్కినేని నాగార్జున మాత్రమే ది ఘోస్ట్ మూవీతో కచ్చితంగా పండుగ రేసులో నిలుస్తాడనే ధీమా కలుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కొన్ని నెలల ముందే పూర్తయింది. ట్రైలర్ రెండు నెలల ముందే లాంచ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాపీగా చేసుకున్నారు. రిలీజ్ ముంగిట ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా పక్కాగా అక్టోబరు 5న రిలీజయ్యేలా కనిపిస్తోంది.
కానీ ఈ పండక్కే అనుకుంటున్న మరో మూడు సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ విషయంలో అంతులేని అయోమయం కొనసాగుతోంది. చిత్ర బృందం రేయింబవళ్లు పని చేస్తూ దసరా డేట్ అందుకోవాలని చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇంకా రెండు రోజుల ప్యాచ్ వర్క్ మిగిలుందని, ఈ రోజు, రేపు ఆ పని పూర్తి చేయబోతున్నారని అంటున్నారు.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి తెలుగు, హిందీ భాషల్లో సినిమాను అక్టోబరు 5న రిలీజ్ చేయడం అంటే సవాలుగానే కనిపిస్తోంది. ప్రమోషన్ల మీద చిరు అండ్ టీం దృష్టిపెట్టకపోవడానికి ఈ బిజీనే కారణం. తమ ప్రయత్నం గట్టిగా చేసి, ఇక సాధ్యం కాదు అనుకున్నపుడే వెనక్కి తగ్గాలని, దసరా అడ్వాంటేజీని వదులుకోకూడదని టీం భావిస్తోంది.
ఐతే గాడ్ ఫాదర్ రిలీజ్ విషయంలో ఏదో ఒక క్లారిటీ వస్తే దాన్ని బట్టి మరో రెండు చిన్న సినిమాల భవితవ్యం తేలనుంది. గాడ్ ఫాదర్ విషయంలో డౌట్లతోనే స్వాతిముత్యం, జిన్నా సినిమాలను దసరా రేసులో నిలపాలని చూస్తున్నారు. చిరు సినిమా రాకపోతే ఈ రెండు చిత్రాలు దసరాకే వస్తాయి. అలా కాని పక్షంలో వెనక్కి తగ్గుతాయి. చిరంజీవి సినిమా విషయంలో క్లారిటీ లేదు కాబట్టే వెయిట్ అండ్ సీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్వాతిముత్యం సినిమా మేకర్స్ అయితే ప్రస్తుతానికి అక్టోబరు 5 డేటుకే కట్టుబడి ఉన్నారు. అలా అని చిరు, నాగ్ ఇద్దరూ రేసులో ఉంటే ఆ చిన్న సినిమాను రిలీజ్ చేయడం సాహసమే అవుతుంది. విష్ణుకు కూడా వాటికి పోటీగా జిన్నాను రిలీజ్ చేసే ధైర్యం లేకపోవచ్చు. చూడాలి మరి ఏమవుతుందో?
This post was last modified on September 23, 2022 1:50 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…