ఆర్ఆర్ఆర్ వచ్చి ఆరు నెలలవుతున్నా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టకపోవడం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతోంది. కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని మెప్పించేలా రాయలేకపోతున్నాడనే వార్త వాళ్ళ ఆందోళనను ఎక్కువ చేస్తోంది. పోనీ హీరో దర్శకుల్లో ఒక్కరైనా అదేం లేదు ఫలానా డేట్ కి స్టార్ట్ చేస్తామని ఖచ్చితంగా చెప్పలేకపోవడం అనుమానాలను ఇంకా బలోపేతం చేస్తోంది. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు యంగ్ టైగర్ కోసం రాసుకుంటున్న స్క్రిప్ట్ ఎప్పుడు తెరకెక్కుతుందో అదీ అంతుచిక్కడం లేదు. ఇవే ఇంత లేట్ అయితే కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనేది భేతాళ ప్రశ్న.
ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే జూనియర్ కు ఇప్పటికిప్పుడు అవసరం లేని పొలిటికల్ ఫోకస్ రావడం మరింత ఇబ్బంది కలిగించే పరిణామం. ఆ మధ్య అమిత్ షా ప్రత్యేకంగా హైదరాబాద్ లో కలుసుకున్నప్పుడు న్యూస్ ఛానల్స్ చేసిన రభస అంతా ఇంతా కాదు. అక్కడికేదో బిజెపిలో చేరిపోయాడన్నంత హంగామా చేశాయి. కేవలం ట్రిపులార్ లో నటనను మెచ్చుకోవడానికి మాత్రమే మీటింగ్ జరిగిందనే లాజిక్ నిజమే అనుకుంటే అంతే సమానంగా గుర్తించాల్సిన రాజమౌళి, రామ్ చరణ్ లతో కూడా ఓ సమావేశం పెట్టుండొచ్చుగా అనే వాదానికి సమాధానం చెప్పడం కష్టం.
తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని పేరు మార్చడం పట్ల ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ హుందాగా స్పందించిన తీరు ఒకవైపు ప్రశంసలను మరోవైపు ఇంకో వర్గంలో అసంతృప్తిని కలగజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీని మీద ఫ్యాన్ డిబేట్స్ జరుగుతున్నాయి. సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ వల్ల ఏళ్లకేళ్లు గడిచిపోయాయని ఇప్పటికే ఫీలవుతుంటే ఇప్పుడు రాజకీయ అంశాల గురించి తారక్ మీద ఫోకస్ లైట్ పడటం కరెక్ట్ కాదనేది అభిమానుల ఆవేదన. కనీసం డైవెర్షన్ కోసమైనా తారక్ కొత్త సినిమా కబురు ఏదైనా పంచుకుంటే బెటర్.
This post was last modified on September 23, 2022 1:46 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…