ఆర్ఆర్ఆర్ వచ్చి ఆరు నెలలవుతున్నా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టకపోవడం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతోంది. కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని మెప్పించేలా రాయలేకపోతున్నాడనే వార్త వాళ్ళ ఆందోళనను ఎక్కువ చేస్తోంది. పోనీ హీరో దర్శకుల్లో ఒక్కరైనా అదేం లేదు ఫలానా డేట్ కి స్టార్ట్ చేస్తామని ఖచ్చితంగా చెప్పలేకపోవడం అనుమానాలను ఇంకా బలోపేతం చేస్తోంది. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు యంగ్ టైగర్ కోసం రాసుకుంటున్న స్క్రిప్ట్ ఎప్పుడు తెరకెక్కుతుందో అదీ అంతుచిక్కడం లేదు. ఇవే ఇంత లేట్ అయితే కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనేది భేతాళ ప్రశ్న.
ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే జూనియర్ కు ఇప్పటికిప్పుడు అవసరం లేని పొలిటికల్ ఫోకస్ రావడం మరింత ఇబ్బంది కలిగించే పరిణామం. ఆ మధ్య అమిత్ షా ప్రత్యేకంగా హైదరాబాద్ లో కలుసుకున్నప్పుడు న్యూస్ ఛానల్స్ చేసిన రభస అంతా ఇంతా కాదు. అక్కడికేదో బిజెపిలో చేరిపోయాడన్నంత హంగామా చేశాయి. కేవలం ట్రిపులార్ లో నటనను మెచ్చుకోవడానికి మాత్రమే మీటింగ్ జరిగిందనే లాజిక్ నిజమే అనుకుంటే అంతే సమానంగా గుర్తించాల్సిన రాజమౌళి, రామ్ చరణ్ లతో కూడా ఓ సమావేశం పెట్టుండొచ్చుగా అనే వాదానికి సమాధానం చెప్పడం కష్టం.
తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని పేరు మార్చడం పట్ల ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ హుందాగా స్పందించిన తీరు ఒకవైపు ప్రశంసలను మరోవైపు ఇంకో వర్గంలో అసంతృప్తిని కలగజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీని మీద ఫ్యాన్ డిబేట్స్ జరుగుతున్నాయి. సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ వల్ల ఏళ్లకేళ్లు గడిచిపోయాయని ఇప్పటికే ఫీలవుతుంటే ఇప్పుడు రాజకీయ అంశాల గురించి తారక్ మీద ఫోకస్ లైట్ పడటం కరెక్ట్ కాదనేది అభిమానుల ఆవేదన. కనీసం డైవెర్షన్ కోసమైనా తారక్ కొత్త సినిమా కబురు ఏదైనా పంచుకుంటే బెటర్.
This post was last modified on September 23, 2022 1:46 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…