పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ-3 ఒకటిగా నిలుస్తుంది. ఈ చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీలో నామమాత్రంగా రిలీజై రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. విడుదలైన నెల తర్వాత కూడా హౌస్ ఫుల్స్తో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు.
ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. ఇంకా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే దీనికి సీక్వెల్ తీసే ఉద్దేశంతో ఉన్నారు హీరో కార్తికేయ, దర్శకుడు చందూ మొండేటి. ఇక సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యాక ఎందుకు ఆగుతారు?
కార్తికేయ పాత్రను పెట్టి ఎన్ని సినిమాలైనా తీయడానికి స్కోప్ ఉండేలా ఫ్లాట్ ఫామ్ రెడీ చేసేశాడు దర్శకుడు చందూ. కార్తికేయ-3 విషయంలో తగ్గేదే లేదని నిఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కార్తికేయను మించి కార్తికేయ-2 పెద్ద సక్సెస్ అయిందని.. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహంతో, వారి దీవెనలతో కార్తికేయ-3 తీయబోతున్నామని.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే క్యూరియాసిటీతో తాను ఉన్నట్లు నిఖిల్ చెప్పాడు.
ఈసారి ఇంకా పెద్ద కాన్వాస్లో, త్రీడీలో సినిమా చేయబోతున్నట్లు కూడా నిఖిల్ వెల్లడించాడు. కార్తికేయ-2లోనే మూడో భాగం గురించి హింట్ కూడా ఇచ్చారు. ఈసారి హీరో ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లబోతున్నాడు. కథ దేశ విదేశాల్లో నడవబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
This post was last modified on September 22, 2022 4:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…