పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ-3 ఒకటిగా నిలుస్తుంది. ఈ చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీలో నామమాత్రంగా రిలీజై రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. విడుదలైన నెల తర్వాత కూడా హౌస్ ఫుల్స్తో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు.
ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. ఇంకా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే దీనికి సీక్వెల్ తీసే ఉద్దేశంతో ఉన్నారు హీరో కార్తికేయ, దర్శకుడు చందూ మొండేటి. ఇక సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యాక ఎందుకు ఆగుతారు?
కార్తికేయ పాత్రను పెట్టి ఎన్ని సినిమాలైనా తీయడానికి స్కోప్ ఉండేలా ఫ్లాట్ ఫామ్ రెడీ చేసేశాడు దర్శకుడు చందూ. కార్తికేయ-3 విషయంలో తగ్గేదే లేదని నిఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కార్తికేయను మించి కార్తికేయ-2 పెద్ద సక్సెస్ అయిందని.. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహంతో, వారి దీవెనలతో కార్తికేయ-3 తీయబోతున్నామని.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే క్యూరియాసిటీతో తాను ఉన్నట్లు నిఖిల్ చెప్పాడు.
ఈసారి ఇంకా పెద్ద కాన్వాస్లో, త్రీడీలో సినిమా చేయబోతున్నట్లు కూడా నిఖిల్ వెల్లడించాడు. కార్తికేయ-2లోనే మూడో భాగం గురించి హింట్ కూడా ఇచ్చారు. ఈసారి హీరో ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లబోతున్నాడు. కథ దేశ విదేశాల్లో నడవబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
This post was last modified on September 22, 2022 4:20 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…