తమిళనాడు అనే కాదు.. సౌత్ ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ స్టార్లలో అజిత్ కుమార్ ఒకడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగు పెట్టి, కెరీర్ ఆరంభంలో ఎక్కువగా క్లాస్ లవ్ స్టోరీలే చేసి.. ఆ తర్వాత తిరుగులేని మాస్ ఇమేజ్తో కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు అజిత్.
విశ్వాసం లాంటి మామూలు మాస్ సినిమాతో తమిళనాట వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం అజిత్కే చెల్లింది. అజిత్ కొత్త సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తోందంటే అభిమానులు చేసే హంగామా అలా ఇలా ఉండదు. వాళ్లను ఈసారి పెద్దగా ఊరించకుండానే.. సడెన్ సర్ప్రైజ్ లాగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించేశాడు అజిత్.
హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన నటించిన కొత్త సినిమాకు తునివు అనే టైటిల్ ఖరారు చేశారు. నో గట్స్ నో గ్లోరీ అనేది క్యాప్షన్. తునివు అంటే తమిళంలో దృఢత్వం అని అర్థం. టైటిల్తో పాటు లాంచ్ అయిన ఫస్ట్ లుక్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేలా ఉంది.
పూర్తిగా తెల్లబడ్డ జుట్టు, గడ్డంతో కనిపిస్తున్న అజిత్.. మెషీన్ గన్ పట్టుకుని విధ్వంసానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది ఫస్ట్ లుక్. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఒక రేంజిలో ఉండబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదల కాబోతోంది.
అజిత్ ఒక దర్శకుడు లేదా నిర్మాతతో కనెక్ట్ అయితే వరుసగా వాళ్లతోనే సినిమాలు చేస్తుంటాడు. ఇంతకుముందు శివ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పుడు దర్శకుడు హెచ్.వినోద్, నిర్మాత బోనీ కపూర్లతోనూ అలాగే వరుసగా కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. వీరి కలయికలో ఇప్పటికే నీర్కొండ పార్వై, వలిమై చిత్రాలు వచ్చాయి. ఈ కాంబోలో తునివు వరుసగా మూడో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. బహుశా ఆమెది అజిత్ భార్య పాత్ర అయి ఉండొచ్చు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…