ఈ మధ్య సమంత సినిమాల వ్యవహారం కంటే ఆమె వ్యక్తిగత విషయాలే ఎక్కువగా మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. గత ఏడాది అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం గురించి కొన్ని నెలల పాటు ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇప్పటికీ ఆ చర్చకు తెరపడట్లేదు. ఇంతలో ఆమె ఆరోగ్యం గురించి కొత్త చర్చ మొదలైంది.
సమంత ఏవో అనారోగ్య సమస్యలతో బాధ పడుతోందని.. ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్లిందని.. అందుకే తన కొత్త చిత్రం ఖుషి చిత్రీకరణను మధ్యలో ఆపేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది కొన్ని రోజులుగా. కొన్ని రోజుల నుంచి ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో సామ్ కనిపించకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
సమంత అనారోగ్యం గురించి, యుఎస్ ట్రిప్ గురించి వార్తలు మొదలయ్యాక మూణ్నాలుగు రోజులు ఆమె వైపు నుంచి ఎలాంటి ఖండన కూడా లేదు. ఐతే ఒక ఇంగ్లిష్ డైలీ సామ్ మేనేజర్ను ఈ విషయమై సంప్రదించగా.. అందరూ ఊహించినట్లే ఈ వార్తలు కేవలం రూమర్లే అంటూ ఖండించేశారు. కానీ సమంత యుఎస్కు వెళ్లడం గురించి, అందుకు కారణాల గురించి మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు.
మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధం అయితే.. సామ్ ఫలానా కారణంతో యుఎస్ వెళ్లింది అని వివరణ ఇవ్వాల్సింది. అలా కాకుండా ఈ ప్రచారం నిజం కాదు అని ఒక్క ముక్కలో తేల్చేసి ఊరుకోవడంతో సామ్ ఫ్యాన్స్కు మరిన్ని సందేహాలు కలుగుతున్నాయి. సమంత ఏదో చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు, సర్జరీ కూడా చేయించుకున్నట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే సమస్యతో ఆమె యుఎస్కు వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…