సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇటీవలే మొదలైన కొత్త సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు అతడు, ఖలేజాలతో పోలిస్తే ఇందులో బోలెడంత యాక్షన్ ఉంటుందని, మహేష్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తుందని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
ఈ సినిమా గురించి చర్చ వచ్చినపుడల్లా యాక్షన్ యాక్షన్ అనే మాటే వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా చిత్రీకరణను ఒక భారీ యాక్షన్ ఘట్టంతోనే మొదలుపెట్టారు.రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఆ షెడ్యూల్ షూట్ గురించి అధికారికంగానే చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. నిర్మాల్లో ఒకరైన నాగవంశీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్ను మహేష్ అభిమానులతో పంచుకున్నాడు.
తమిళంలో ప్రస్తుతం టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న కవల సోదరులు అన్బు-అరివు ఈ సినిమాకు పని చేస్తుండడం విశేషం. విక్రమ్ సహా కొన్ని భారీ చిత్రాలకు వాళ్లు పని చేశారు. తెలుగులో ఈ సోదరులు చేస్తున్న తొలి చిత్రం మహేష్-త్రివిక్రమ్లదే. వీరి నేతృత్వంలో తొలి షెడ్యూల్లో కొన్ని కిక్ యాస్, హై ఆక్టేన్ , ఎపిక్ యాక్షన్ సీన్లు చిత్రీకరించామంటూ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పాడు నాగవంశీ. సినిమా రెండో షెడ్యూల్ దసరా తర్వాత ఉంటుందని, అందులో మహేష్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని నాగవంశీ అప్డేట్ ఇచ్చాడు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…