సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇటీవలే మొదలైన కొత్త సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు అతడు, ఖలేజాలతో పోలిస్తే ఇందులో బోలెడంత యాక్షన్ ఉంటుందని, మహేష్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తుందని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
ఈ సినిమా గురించి చర్చ వచ్చినపుడల్లా యాక్షన్ యాక్షన్ అనే మాటే వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా చిత్రీకరణను ఒక భారీ యాక్షన్ ఘట్టంతోనే మొదలుపెట్టారు.రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఆ షెడ్యూల్ షూట్ గురించి అధికారికంగానే చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. నిర్మాల్లో ఒకరైన నాగవంశీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్ను మహేష్ అభిమానులతో పంచుకున్నాడు.
తమిళంలో ప్రస్తుతం టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న కవల సోదరులు అన్బు-అరివు ఈ సినిమాకు పని చేస్తుండడం విశేషం. విక్రమ్ సహా కొన్ని భారీ చిత్రాలకు వాళ్లు పని చేశారు. తెలుగులో ఈ సోదరులు చేస్తున్న తొలి చిత్రం మహేష్-త్రివిక్రమ్లదే. వీరి నేతృత్వంలో తొలి షెడ్యూల్లో కొన్ని కిక్ యాస్, హై ఆక్టేన్ , ఎపిక్ యాక్షన్ సీన్లు చిత్రీకరించామంటూ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పాడు నాగవంశీ. సినిమా రెండో షెడ్యూల్ దసరా తర్వాత ఉంటుందని, అందులో మహేష్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని నాగవంశీ అప్డేట్ ఇచ్చాడు.
This post was last modified on September 21, 2022 7:36 pm
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…