సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇటీవలే మొదలైన కొత్త సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు అతడు, ఖలేజాలతో పోలిస్తే ఇందులో బోలెడంత యాక్షన్ ఉంటుందని, మహేష్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తుందని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
ఈ సినిమా గురించి చర్చ వచ్చినపుడల్లా యాక్షన్ యాక్షన్ అనే మాటే వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా చిత్రీకరణను ఒక భారీ యాక్షన్ ఘట్టంతోనే మొదలుపెట్టారు.రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఆ షెడ్యూల్ షూట్ గురించి అధికారికంగానే చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. నిర్మాల్లో ఒకరైన నాగవంశీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్ను మహేష్ అభిమానులతో పంచుకున్నాడు.
తమిళంలో ప్రస్తుతం టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న కవల సోదరులు అన్బు-అరివు ఈ సినిమాకు పని చేస్తుండడం విశేషం. విక్రమ్ సహా కొన్ని భారీ చిత్రాలకు వాళ్లు పని చేశారు. తెలుగులో ఈ సోదరులు చేస్తున్న తొలి చిత్రం మహేష్-త్రివిక్రమ్లదే. వీరి నేతృత్వంలో తొలి షెడ్యూల్లో కొన్ని కిక్ యాస్, హై ఆక్టేన్ , ఎపిక్ యాక్షన్ సీన్లు చిత్రీకరించామంటూ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పాడు నాగవంశీ. సినిమా రెండో షెడ్యూల్ దసరా తర్వాత ఉంటుందని, అందులో మహేష్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని నాగవంశీ అప్డేట్ ఇచ్చాడు.
This post was last modified on September 21, 2022 7:36 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…