సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇటీవలే మొదలైన కొత్త సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు అతడు, ఖలేజాలతో పోలిస్తే ఇందులో బోలెడంత యాక్షన్ ఉంటుందని, మహేష్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తుందని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
ఈ సినిమా గురించి చర్చ వచ్చినపుడల్లా యాక్షన్ యాక్షన్ అనే మాటే వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా చిత్రీకరణను ఒక భారీ యాక్షన్ ఘట్టంతోనే మొదలుపెట్టారు.రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఆ షెడ్యూల్ షూట్ గురించి అధికారికంగానే చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. నిర్మాల్లో ఒకరైన నాగవంశీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్ను మహేష్ అభిమానులతో పంచుకున్నాడు.
తమిళంలో ప్రస్తుతం టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న కవల సోదరులు అన్బు-అరివు ఈ సినిమాకు పని చేస్తుండడం విశేషం. విక్రమ్ సహా కొన్ని భారీ చిత్రాలకు వాళ్లు పని చేశారు. తెలుగులో ఈ సోదరులు చేస్తున్న తొలి చిత్రం మహేష్-త్రివిక్రమ్లదే. వీరి నేతృత్వంలో తొలి షెడ్యూల్లో కొన్ని కిక్ యాస్, హై ఆక్టేన్ , ఎపిక్ యాక్షన్ సీన్లు చిత్రీకరించామంటూ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పాడు నాగవంశీ. సినిమా రెండో షెడ్యూల్ దసరా తర్వాత ఉంటుందని, అందులో మహేష్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని నాగవంశీ అప్డేట్ ఇచ్చాడు.
This post was last modified on September 21, 2022 7:36 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…