ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఒక సినిమాను నామినేట్ చేయడం మామూలే. ఐతే ఆ ప్రక్రియ పెద్దగా హడావుడి లేకుండా జరిగిపోతుంటుంది. చాలా వరకు జనాలకు టచ్ లేని ఆర్ట్ సినిమాలను ఎంపిక చేసి ఆస్కార్ జ్యూరీకి పంపిస్తుంటారు. అవి కనీసం తుది జాబితా వరకు కూడా వెళ్లలేక ఆరంభ దశలోనే తిరస్కరణకు గురవుతుంటాయి.
ఇదంతా మనకు మామూలే అని సరిపెట్టుకుంటూ ఉంటారు జనం. ఐతే ఈసారి మాత్రం ఆస్కార్ అవార్డుల ముంగిట మనవాళ్లలో ఎన్నో ఆశలు రేగాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్తో పాటు నేటివ్ అమెరికన్స్ నుంచి ఊహించని స్తాయిలో ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జ్యూరీ పరిశీలనకు పంపితే కచ్చితంగా పురస్కారాలు దక్కుతాయని ఆశించారు.
కానీ ఆర్ఆర్ఆర్ను పక్కన పెట్టి చెల్లో షో అనే గుజరాతీ మూవీని ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసింది భారత ప్రభుత్వం. ఎన్నో విషయాల్లో దక్షిణాది మీద వివక్ష చూపిస్తూ గుజరాత్కు పెద్ద పీట వేస్తున్న మోడీ సర్కారు.. చివరికి సినిమా విషయంలోనూ అదే చేసిందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే చెల్లో షో గొప్ప సినిమా అయ్యే ఉంటుందని, లేదంటే ఆషామాషీగా అవార్డు కోసం పంపరని అనే వాళ్లు కూడా ఉన్నారు.
ఐతే చెల్లో షో ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ.. అది ఒరిజినల్ కాదు అనే చర్చ నడుస్తోంది. ఆ చిత్రం సినిమా పారడైసో అనే విదేశీ చిత్రానికి రీమేక్ అట. ఆ చిత్రానికి 1988లోనే ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందట. ఈ రెండు చిత్రాల పోస్టర్లు చూస్తే అది వాస్తవమే అనిపిస్తోంది. ఇది అఫీషియల్ రీమేక్ కూడా కాదని.. కాపీ కొట్టి సినిమా తీశారని.. ఈ విషయం అకాడమీ వాళ్లకు తెలియకుండా పోదని, అప్పుడు వాళ్లు ఛీకొట్టి సినిమాను వెనక్కి పంపడం గ్యారెంటీ అని అంటున్నారు.
This post was last modified on September 21, 2022 2:41 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…