ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఒక సినిమాను నామినేట్ చేయడం మామూలే. ఐతే ఆ ప్రక్రియ పెద్దగా హడావుడి లేకుండా జరిగిపోతుంటుంది. చాలా వరకు జనాలకు టచ్ లేని ఆర్ట్ సినిమాలను ఎంపిక చేసి ఆస్కార్ జ్యూరీకి పంపిస్తుంటారు. అవి కనీసం తుది జాబితా వరకు కూడా వెళ్లలేక ఆరంభ దశలోనే తిరస్కరణకు గురవుతుంటాయి.
ఇదంతా మనకు మామూలే అని సరిపెట్టుకుంటూ ఉంటారు జనం. ఐతే ఈసారి మాత్రం ఆస్కార్ అవార్డుల ముంగిట మనవాళ్లలో ఎన్నో ఆశలు రేగాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్తో పాటు నేటివ్ అమెరికన్స్ నుంచి ఊహించని స్తాయిలో ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జ్యూరీ పరిశీలనకు పంపితే కచ్చితంగా పురస్కారాలు దక్కుతాయని ఆశించారు.
కానీ ఆర్ఆర్ఆర్ను పక్కన పెట్టి చెల్లో షో అనే గుజరాతీ మూవీని ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసింది భారత ప్రభుత్వం. ఎన్నో విషయాల్లో దక్షిణాది మీద వివక్ష చూపిస్తూ గుజరాత్కు పెద్ద పీట వేస్తున్న మోడీ సర్కారు.. చివరికి సినిమా విషయంలోనూ అదే చేసిందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే చెల్లో షో గొప్ప సినిమా అయ్యే ఉంటుందని, లేదంటే ఆషామాషీగా అవార్డు కోసం పంపరని అనే వాళ్లు కూడా ఉన్నారు.
ఐతే చెల్లో షో ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ.. అది ఒరిజినల్ కాదు అనే చర్చ నడుస్తోంది. ఆ చిత్రం సినిమా పారడైసో అనే విదేశీ చిత్రానికి రీమేక్ అట. ఆ చిత్రానికి 1988లోనే ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందట. ఈ రెండు చిత్రాల పోస్టర్లు చూస్తే అది వాస్తవమే అనిపిస్తోంది. ఇది అఫీషియల్ రీమేక్ కూడా కాదని.. కాపీ కొట్టి సినిమా తీశారని.. ఈ విషయం అకాడమీ వాళ్లకు తెలియకుండా పోదని, అప్పుడు వాళ్లు ఛీకొట్టి సినిమాను వెనక్కి పంపడం గ్యారెంటీ అని అంటున్నారు.
This post was last modified on September 21, 2022 2:41 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…