ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఒక సినిమాను నామినేట్ చేయడం మామూలే. ఐతే ఆ ప్రక్రియ పెద్దగా హడావుడి లేకుండా జరిగిపోతుంటుంది. చాలా వరకు జనాలకు టచ్ లేని ఆర్ట్ సినిమాలను ఎంపిక చేసి ఆస్కార్ జ్యూరీకి పంపిస్తుంటారు. అవి కనీసం తుది జాబితా వరకు కూడా వెళ్లలేక ఆరంభ దశలోనే తిరస్కరణకు గురవుతుంటాయి.
ఇదంతా మనకు మామూలే అని సరిపెట్టుకుంటూ ఉంటారు జనం. ఐతే ఈసారి మాత్రం ఆస్కార్ అవార్డుల ముంగిట మనవాళ్లలో ఎన్నో ఆశలు రేగాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్తో పాటు నేటివ్ అమెరికన్స్ నుంచి ఊహించని స్తాయిలో ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జ్యూరీ పరిశీలనకు పంపితే కచ్చితంగా పురస్కారాలు దక్కుతాయని ఆశించారు.
కానీ ఆర్ఆర్ఆర్ను పక్కన పెట్టి చెల్లో షో అనే గుజరాతీ మూవీని ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసింది భారత ప్రభుత్వం. ఎన్నో విషయాల్లో దక్షిణాది మీద వివక్ష చూపిస్తూ గుజరాత్కు పెద్ద పీట వేస్తున్న మోడీ సర్కారు.. చివరికి సినిమా విషయంలోనూ అదే చేసిందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే చెల్లో షో గొప్ప సినిమా అయ్యే ఉంటుందని, లేదంటే ఆషామాషీగా అవార్డు కోసం పంపరని అనే వాళ్లు కూడా ఉన్నారు.
ఐతే చెల్లో షో ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ.. అది ఒరిజినల్ కాదు అనే చర్చ నడుస్తోంది. ఆ చిత్రం సినిమా పారడైసో అనే విదేశీ చిత్రానికి రీమేక్ అట. ఆ చిత్రానికి 1988లోనే ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందట. ఈ రెండు చిత్రాల పోస్టర్లు చూస్తే అది వాస్తవమే అనిపిస్తోంది. ఇది అఫీషియల్ రీమేక్ కూడా కాదని.. కాపీ కొట్టి సినిమా తీశారని.. ఈ విషయం అకాడమీ వాళ్లకు తెలియకుండా పోదని, అప్పుడు వాళ్లు ఛీకొట్టి సినిమాను వెనక్కి పంపడం గ్యారెంటీ అని అంటున్నారు.
This post was last modified on September 21, 2022 2:41 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…