అసలేమాత్రం ఊహకందకుండా కేవలం రాబోయే ట్రైలర్ లో ఒక పది సెకండ్ల ఆడియో క్లిప్ ఇంత వైరల్ అవుతుందని బహుశా గాడ్ ఫాదర్ టీమ్ ఏ మాత్రం ఊహించి ఉండదు. కామెడీ ఏంటంటే ఇదేదో సీరియస్ అన్నారని కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా లైవ్ డిబేట్లు పెట్టేశాయి. సినిమా రంగం మీద అంతగా అవగాహన లేని సామాన్యులకు మెగాస్టార్ నిజంగానే పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడనుకున్నారు. ఏ టైమింగ్ లో ఇది పెట్టాలని చిరంజీవి అనుకున్నారో కానీ దాని లక్ష్యం సంపూర్ణంగా కాదు ఏకంగా హద్దులు దాటి ప్రయాణం చేసింది.
ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ అన్ని హక్కులు కలిపి 200 కోట్లకు పైగా డీల్ సెట్ చేసుకుందనే వార్త అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క బజ్ లేదని ఫీలవుతుంటే మరీ ఎక్కువ చేసి ఫిగర్లు చెబుతున్నారనే అనుమానం కలిగింది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 57 కోట్లకు ఒప్పందం చేసుకుంది. హిందీ తెలుగు కలిపి ఈ రేటట. రెండు బాషల శాటిలైట్ హక్కులను 60 కోట్లకు ఇచ్చేశారు. ఇక్కడి దాకా నాన్ థియేట్రికల్ లెక్క చూసుకుంటే 117 కోట్లు అయ్యింది. ఆచార్య తర్వాత ఈ రేంజ్ అంటే చిన్న విషయం కాదు.
ఇక థియేటర్ సంగతి చూస్తే నిర్మాతలు 90 కోట్ల దాకా వరల్డ్ వైడ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అంత రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేని పక్షంగా దీన్నే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకుని ప్రొడ్యూసర్లు ఓన్ రిలీజ్ కు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడా టార్గెట్ 207 కోట్లకు చేరుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇది అందుకోవడం ఈజీనే. లేదూ ఖైదీ నెంబర్ 150 రేంజ్ రెస్పాన్స్ వచ్చినా చాలు గట్టెక్కుతుంది. లేదూ బయ్యర్లకు ఇవ్వాలని డిసైడ్ అయితే మాత్రం ఇక్కడ చెప్పిన తొంబై కోట్ల ఫిగర్ లో చాలా మార్పు వస్తుంది. ఏది ఏమైనా నెగటివ్ పబ్లిసిటీ ఉన్న ట్రెండ్ లోనూ ఇంత రచ్చ చేయడం చిరుకే చెల్లింది .
This post was last modified on September 21, 2022 9:39 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…