Chennakesava Reddy
ఈ మధ్య స్టార్ హీరోల పాత సినిమాలను స్పెషల్ షోలుగా వేసి అభిమానులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా మూవీతో ఆ ట్రెండ్ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా హంగామా చూసిన మిగతా హీరోల అభిమానులు తమ కథానాయకుడి సినిమాలతోనూ ఇలా రచ్చ చేయాలని ఆశపడ్డారు.
త్వరలోనే బాలయ్య (Balakrishna) అభిమానులు ఇదే తరహాలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. అలా అని వాళ్లేమీ బాలయ్య బ్లాక్బస్టర్ మూవీని ఎంచుకోలేదు. బాలయ్య బర్త్ డే కోసం ఎదురు చూడట్లేదు. బాలయ్య కెరీర్లో అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టిన చెన్నకేశవ రెడ్డి సినిమాకు స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండడం విశేషం.
ఈ నెల 25తో చెన్నకేశవరెడ్డి(Chennakeshava Reddy) సినిమా విడుదలై 20 ఏళ్లు కాబోతోంది. ఈ సందర్భంగా యుఎస్ బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాకు భారీ లెవెల్లో స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. అక్టోబరు తొలి వారంలో ఈ షోలు ఉంటాయట. దాదాపు అక్కడ 25 షోలు దాకా ప్లాన్ చేస్తున్నారట. ఒక ఫ్లాప్ మూవీకి ఇంత పెద్ద సంఖ్యలో స్పెషల్ షోలంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతానికి యుఎఎస్ షోల గురించే సమాచారం బయటికి వచ్చింది.
త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోలు ప్లాన్ చేయొచ్చని అంటున్నారు. చెన్నకేశవరెడ్డి అప్పట్లో అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. ఇందులో బాలయ్య సీనియర్ క్యారెక్టర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేదే. ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్న ఇలాంటి సినిమాలకు స్పెషల్ షోలు వేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. పవన్ ఫ్యాన్స్ కూడా జల్సా లాంటి యావరేజ్ మూవీతోనే మామూలు హంగామా చేయలేదు. బాలయ్య ఫ్యాన్స్ కూడా వారినే అనుసరిస్తున్నట్లున్నారు.
This post was last modified on September 20, 2022 5:08 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…