‘గాడ్ ఫాదర్ ‘ ప్రమోషన్స్ మీద మెగా స్టార్ అండ్ టీమ్ ఫోకస్ పెట్టడం లేదని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ కూడా డిలే అవ్వడం, ఇంకా లిరికల్ వీడియో గురించి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాకపోవడంతో ఫ్యాన్స్ మేకర్స్ మీద సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి చేయడం మొదలెట్టారు. దీంతో స్వయంగా మెగా స్టార్ రంగంలోకి దిగారు.
ఓ వాయిస్ క్లిప్ తో గాడ్ ఫాదర్ రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిరు. “నేను రాజకీయాలకు దూరం కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు.” అంటూ సినిమాలో ఉన్న ఓ డైలాగ్ ను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. అయితే ఇది సినిమాలోని డైలాగ్ అని చిరు అక్కడ చెప్పలేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ ను కాంగ్రెస్ లోకి వీలినం చేసి కేంద్ర మంత్రి గా కూడా పనిచేశారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టారు.
అయితే ఇప్పుడు చిరు లీక్ చేసిన డైలాగ్ వింటుంటే రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అవుతుంది. సినిమాలో తన కారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయో మెగా స్టార్ ఈ ఆడియో తో చెప్పకనే చెప్పారు. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన లూసిఫర్ కి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న రిలీజ్ అవ్వనుంది. మరికొన్ని గంటల్లో ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. మరో ఐదు రోజుల్లో ట్రెయిలర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నెలాఖరున అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నారు. సో మెగా డైలాగ్ తో మెగా ప్రమోషన్స్ మొదలయినట్టే. ఇక నుండి గాడ్ ఫాదర్ నుండి వరుసగా అప్ డేట్స్ రానున్నాయి. సినిమా మీద బజ్ పెంచే సరికొత్త ప్రమోషన్స్ ప్లానింగ్ రెడీ చేస్తోంది టీమ్.
This post was last modified on September 20, 2022 5:13 pm
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…