దిల్ బేచరా.. ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. మూడు వారాల కిందట ఆత్మహత్యకు పాల్పడి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ సంస్థ ఈ నెల 24న నేరుగా ఆన్ లైన్లో స్ట్రీమ్ చేయనుంది.
సోమవారమే ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. అంచనాలకు తగ్గని విధంగా.. హార్ట్ టచింగ్గా ఉన్న ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ రిలీజైన మూడు గంటల్లోనే మిలియన్ లైక్స్ వచ్చాయి యూట్యూబ్లో. అప్పుడే వ్యూస్ కూడా 40 లక్షలు దాటిపోయాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమా ట్రైలర్కూ ఇంత వేగంగా ఇన్ని లైక్స్ రాలేదు. దీన్ని బట్టి సుశాంత్ మీద ప్రేక్షకుల్లో ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక దిల్ బేచరా విషయానికి వస్తే.. ఇది ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ కావడం విశేషం. ఆ సినిమా పేరు.. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్. ఇది 2014లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అంతకు రెండేళ్ల ముందు ఇదే పేరుతో రిలీజైన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు ఆ పుస్తకం, సినిమా హక్కులు తీసుకుని హిందీలో దిల్ బేచరా సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.
ఈ చిత్రంతో సుశాంత్ తొలి సినిమా కై పో చేకు దర్శకత్వ శాఖలో పని చేసి.. ఆ తర్వాత అతడి స్నేహితుడిగా కొనసాగిన ముకేష్ చబ్రా దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంజన సంఘికి కూడా ఇదే తొలి సినిమా. ఆమె సుశాంత్ మీద మీ టూ ఆరోపణలు చేసినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి. కానీ అదంతా అబద్ధమని అప్పుడామె ఖండించింది. దర్శకుడు, హీరోయిన్లకు తొలి సినిమా అయినా దిల్ బేచరా.. సుశాంత్కు చివరి సినిమాగా మారడం విషాదం.
This post was last modified on July 7, 2020 11:11 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…