దిల్ బేచరా.. ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. మూడు వారాల కిందట ఆత్మహత్యకు పాల్పడి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ సంస్థ ఈ నెల 24న నేరుగా ఆన్ లైన్లో స్ట్రీమ్ చేయనుంది.
సోమవారమే ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. అంచనాలకు తగ్గని విధంగా.. హార్ట్ టచింగ్గా ఉన్న ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ రిలీజైన మూడు గంటల్లోనే మిలియన్ లైక్స్ వచ్చాయి యూట్యూబ్లో. అప్పుడే వ్యూస్ కూడా 40 లక్షలు దాటిపోయాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమా ట్రైలర్కూ ఇంత వేగంగా ఇన్ని లైక్స్ రాలేదు. దీన్ని బట్టి సుశాంత్ మీద ప్రేక్షకుల్లో ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక దిల్ బేచరా విషయానికి వస్తే.. ఇది ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ కావడం విశేషం. ఆ సినిమా పేరు.. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్. ఇది 2014లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అంతకు రెండేళ్ల ముందు ఇదే పేరుతో రిలీజైన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు ఆ పుస్తకం, సినిమా హక్కులు తీసుకుని హిందీలో దిల్ బేచరా సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.
ఈ చిత్రంతో సుశాంత్ తొలి సినిమా కై పో చేకు దర్శకత్వ శాఖలో పని చేసి.. ఆ తర్వాత అతడి స్నేహితుడిగా కొనసాగిన ముకేష్ చబ్రా దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంజన సంఘికి కూడా ఇదే తొలి సినిమా. ఆమె సుశాంత్ మీద మీ టూ ఆరోపణలు చేసినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి. కానీ అదంతా అబద్ధమని అప్పుడామె ఖండించింది. దర్శకుడు, హీరోయిన్లకు తొలి సినిమా అయినా దిల్ బేచరా.. సుశాంత్కు చివరి సినిమాగా మారడం విషాదం.
This post was last modified on July 7, 2020 11:11 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…