దిల్ బేచరా.. ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. మూడు వారాల కిందట ఆత్మహత్యకు పాల్పడి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ సంస్థ ఈ నెల 24న నేరుగా ఆన్ లైన్లో స్ట్రీమ్ చేయనుంది.
సోమవారమే ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. అంచనాలకు తగ్గని విధంగా.. హార్ట్ టచింగ్గా ఉన్న ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ రిలీజైన మూడు గంటల్లోనే మిలియన్ లైక్స్ వచ్చాయి యూట్యూబ్లో. అప్పుడే వ్యూస్ కూడా 40 లక్షలు దాటిపోయాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమా ట్రైలర్కూ ఇంత వేగంగా ఇన్ని లైక్స్ రాలేదు. దీన్ని బట్టి సుశాంత్ మీద ప్రేక్షకుల్లో ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక దిల్ బేచరా విషయానికి వస్తే.. ఇది ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ కావడం విశేషం. ఆ సినిమా పేరు.. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్. ఇది 2014లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అంతకు రెండేళ్ల ముందు ఇదే పేరుతో రిలీజైన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు ఆ పుస్తకం, సినిమా హక్కులు తీసుకుని హిందీలో దిల్ బేచరా సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.
ఈ చిత్రంతో సుశాంత్ తొలి సినిమా కై పో చేకు దర్శకత్వ శాఖలో పని చేసి.. ఆ తర్వాత అతడి స్నేహితుడిగా కొనసాగిన ముకేష్ చబ్రా దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంజన సంఘికి కూడా ఇదే తొలి సినిమా. ఆమె సుశాంత్ మీద మీ టూ ఆరోపణలు చేసినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి. కానీ అదంతా అబద్ధమని అప్పుడామె ఖండించింది. దర్శకుడు, హీరోయిన్లకు తొలి సినిమా అయినా దిల్ బేచరా.. సుశాంత్కు చివరి సినిమాగా మారడం విషాదం.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…