సీనియర్ దర్శకుడు తేజ ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన కెరీర్లో చాలా వరకు లవ్ స్టోరీలే తీశాడు. ఐతే చాలా వరకు ఆయన సినిమాల్లో అందమైన హీరో హీరోయిన్లను పెట్టుకునేవాడు. కానీ ఈసారి మాత్రం ఆయన రూటు మారుస్తున్నాడు.
దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన అహింస అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుర్రాడు లుక్స్ పరంగా అంతంతమాత్రమే. ఇంటర్నెట్లో కనిపించే ఫొటోలు చూస్తే సాధారణంగానే కనిపిస్తాడు.
సినిమా కోసం అతడికేమీ పెద్దగా మెరుగులు దిద్దినట్లు కనిపించడం లేదు. నేచురల్గా చూపించాలన్న ఉద్దేశంతో పెద్దగా మేకప్, వేరే రకమైన కరెక్షన్లు ఏమీ లేకుండా సినిమాలో సాధారణంగా చూపించాలనుకున్నట్లున్నాడు తేజ. అతడి పక్కన గీతిక అనే కొత్తమ్మాయిని హీరోయిన్గా ఎంచుకున్నాడు తేజ. ఆమె కూడా సాధారణంగానే అనిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అందులో విజువల్స్ చూస్తే.. ఒక నది, జలపాతం నేపథ్యంలో ఆహ్లాదకరంగా అనిపిస్తున్న.. హీరో హీరోయిన్లయితే మామూలుగా కనిపించారు. హీరో హీరోయిన్లు మరీ డీగ్లామరస్గా కనిపించారు ఈ పాటలో.
అందులోనూ హీరోయిన్ అయితే పేషెంట్ పాత్రలో కనిపించడం.. ఆమెను ఒక తోపుడు బండిలో పెట్టి హీరో తోసుకెళ్లడం, ఎప్పుడూ ఆమెకు ఒక సెలైన్ బాటిల్ పెట్టి ఉండడం ఇదంతా చూస్తే మామూలుగా లవ్ స్టోరీల నుంచి ఆశించే ఆహ్లాదకరమైన రొమాంటిక్ మూమెంట్స్ ఏమీ ఇందులో ఉండవని.. సినిమా హార్డ్ హిట్టింగ్గా, కొంచెం విషాదభరితంగా, అలజడితో సాగుతుందని అర్థమవుతోంది.
తేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన నువ్వు నేను మూవీ ఛాయలు ఇందులో కనిపిస్తున్నాయి. ఆ చిత్రాన్ని నిర్మించిన జెమిని కిరణ్.. సురేష్ బాబుతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆర్పీ పట్నాయక్ తేజ సినిమాకు సంగీతం అందించడం విశేషం. సిద్ శ్రీరామ్ పాడిన తొలి పాట పర్వాలేదనిపించింది.
This post was last modified on September 20, 2022 2:24 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…